కరోనా బారిన 53 మంది జర్నలిస్ట్ లు
BY Telugu Gateway20 April 2020 3:41 PM GMT

X
Telugu Gateway20 April 2020 3:41 PM GMT
దేశ ఆర్ధిక రాజధాని ముంబయ్ లో కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. దేశంలోనే అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్రలోనే ఉన్నాయి. కొత్తగా 53 మంది జర్నలిస్ట్ లకు కరోనా సోకినట్లు బృహన్ ముంబయ్ మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు నిర్ధారించారు. ఇటీవల నిర్వహించిన ప్రత్యేక కరోనా శిబిరంలో 171 మందికి పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లోనే 53 మంది జర్నలిస్ట్ లకు కరోనా ఉన్నట్లు తేలింది.
ప్రమాదకర పరిణామం ఏమిటంటే పాజిటివ్ గా తేలిన జర్నలిస్ట్ ల్లో ఎవరికి కూడా కరోనా లక్షణాలు కన్పించలేదు. వీళ్లందరినీ ఐసోలేషన్ కేంద్రానికి తరలించి చికిత్స ప్రారంభించారు. జర్నలిస్టుల కుటుంబ సభ్యులు..వీరు ఎవరెవరిని కలిశారు అనే అంశాలను గుర్తించి వారందరికీ క్వారంటైన్ కు తరలిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
Next Story