Telugu Gateway
Latest News

కరోనా వస్తే ...అక్కడ కాల్చేస్తారు!

కరోనా వస్తే ...అక్కడ కాల్చేస్తారు!
X

ఏ దేశం అయినా కరోనా వస్తే ..ఆ వైరస్ వ్యాప్తి కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. కరోనా వైరస్ విభృబించిన చైనాలోనూ అదే పనిచేస్తున్నారు. ప్రపంచంలోని పలు దేశాలు కరోనా నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాయి. కానీ ఆ దేశంలో మాత్రం ఎవరికైనా కరోనా వచ్చిందని తేలితే వాళ్లను కాల్చి చంపేస్తున్నారు. అది ఎక్కడో తెలుసా? ఉత్తర కొరియాలో. ఓ వ్యక్తికి ఆ దేశంలో కరోనా వైరస్ సోకిందని తేలగానే..అతన్ని కాల్చిచంపేయాలని కిమ్ ఆదేశించటం..ఆ పనిచేయటం చకచకా సాగిపోయాయని ఐబి టైమ్స్ అనే పత్రిక తెలిపింది.

అంతే కాదు దేశంలోని ఉన్నతాధికారులు అందరికీ కిమ్ హెచ్చరికలు జారీ చేశారు.. దేశంలోకి కరోనా వైరస్ రావటానికి వీల్లేదని..వచ్చిదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దీంతో అధికారులు గడగడ వణికిపోవాల్సి వస్తోంది. ఇప్పటికే దక్షిణ కొరియాను కరోనా వైరస్ వణికిస్తోంది. అక్కడ ఈ వైరస్ సోకి చనిపోయిన వారి సంఖ్య ఎక్కువ ఉండటంతోపాటు కొత్తగా కేసు నమోదు సంఖ్య కూడా పెరుగుతోంది. పలు అగ్రశ్రేణి సంస్థలు అక్కడ యూనిట్లను మూసివేయాల్సిన పరిస్థితి వచ్చింది.

Next Story
Share it