Telugu Gateway
Latest News

ఆ నోట్లు చెలామణిలోనే ఉంటాయి

ఆ నోట్లు చెలామణిలోనే ఉంటాయి
X

ఆ నోట్ వచ్చినప్పటి నుంచి సంచలనాలే. నిత్యం వార్తల్లో ఉంటూనే ఉంది. రెండు వేల రూపాయల నోట్లు కూడా త్వరలోనే రద్దు అవుతాయంటూ వార్తలు హల్ చల్ చేయటం..కేంద్రం ప్రకటన చేయటం మామూలు అయిపోయింది. అయితే ఈ నోట్లు వచ్చిన తొలి నాళ్ళతో పోలిస్తే అవి మార్కెట్లో కన్పించటం కూడా అరుదే అయిపోయింది. అయితే తాజాగా ఆర్ బిఐ కొత్తగా రెండు వేల రూపాయల నోట్లను కస్టమర్లకు ఇవ్వొద్దని..ఏటీఎంల్లో కూడా పెట్టొద్దని ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి.

దీనిపై కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. రెండు వేల రూపాయల నోట్ల జారీని నిలిపి వేయాల్సిందిగా బ్యాంకులకు తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని స్పష్టం చేశారు. తనకు తెలిసినంతవరకు బ్యాంకులకు అలాంటి ఆదేశాలేవీ ఇవ్వలేదంటూ ఈ నోట్లకు సంబంధించి జరుగుతున్న పుకార్లను కొట్టి పారేశారు. 2 వేల రూపాయల విలువైన నోట్లు చట్ట బద్ధంగా చలామణిలో ఉంటాయని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి భయాలు అక్కర్లేదని..పుకార్లను నమ్మవద్దని కోరారు.

Next Story
Share it