Telugu Gateway
Latest News

మార్చి3న నిర్భయ దోషుల ఉరి..కొత్త తేదీ ప్రకటించిన కోర్టు

మార్చి3న నిర్భయ దోషుల ఉరి..కొత్త తేదీ ప్రకటించిన కోర్టు
X

ఉరి శిక్ష అమలు తేదీ ఖరారు..వాయిదా..ఖరారు..వాయిదా. ఇదే నిర్భయ దోషుల విషయంలో జరుగుతున్న వ్యవహారం. ఇప్పటికే పలుమార్లు డెత్ వారెంట్లు జారీ చేసిన రకరకాల కారణాలతో శిక్ష అమలు వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పుడు మరో తేదీ ఇచ్చింది. ఢిల్లీలోని పాటియాలా కోర్టు నిర్భయ దోషుల ఉరి అమలుకు కొత్త తేదీ ప్రకటించింది. మరి ఇఫ్పుడు అయినా దేశం ఎంతగానో ఎదురుచూస్తున్న ఆ శిక్ష అమలు అవుతుందా?. వేచిచూడాల్సిందే. కొత్తగా మార్చి 3న ఉదయం 6 గంటలకు నలుగురు దోషులు వినయ్‌ శర్మ, పవన్‌ గుప్తా, ముఖేష్‌ సింగ్‌, అక్షయ్‌ సింగ్‌లను ఉరితీయాలని ఢిల్లీలోని పటియాల హౌస్‌ కొత్త డెత్‌వారెంట్లు జారీచేసింది. నలుగురు దోషులను ఒకేసారి ఉరితీయాలని జైలు అధికారులను ఆదేశించింది.

ప్రస్తుతం వారున్న తీహార్‌ జైలులోనే వారిని ఉరితీయనున్నారు. గతంలో జనవరి 22, ఫిబ్రవరి 1 దోషుల ఉరిశిక్ష అమలుకై రెండుసార్లు డెత్ వారెంట్లు జారీ అయినప్పటికీ.. పలుమార్లు పిటిషన్లు దాఖలు చేస్తూ శిక్ష నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ వచ్చారు. దోషులకు వెంటనే ఉరిశిక్ష అమలు చేయాలంటూ కేంద్ర హోంశాఖ ఢిల్లీ హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దోషుల తీరుపై న్యాయస్థానం కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో పటియాల కోర్టు దోషులను ఉరితీయాలంటూ తాజాగా డెత్‌వారెంట్లు జారీచేసింది.

Next Story
Share it