Telugu Gateway
Latest News

హైదరాబాద్-గోవా విమాన టిక్కెట్ రూ.1899లే

హైదరాబాద్-గోవా విమాన టిక్కెట్ రూ.1899లే
X

చౌక విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా హైదరాబాద్ నుంచి పలు ప్రాంతాలకు ప్రయాణించే వారి కోసం ఆఫర్లు ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ముంబయ్ కు 1799 రూపాయలు, హైదరాబాద్ నుంచి చెన్నయ్ కు 1819 రూపాయలు, హైదరాబాద్ నుంచి గోవాకు 1899 రూపాయలకే టిక్కెట్లు ఆఫర్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ టిక్కెట్ల అమ్మకం జనవరి 20 నుంచి 22 వరకూ కొనసాగనున్నాయి. ఏకంగా లక్ష ప్రమోషనల్ సీట్లు అందుబాటులో ఉన్నాయని కంపెనీ వెల్లడించింది. ఈ ఆఫర్ కింద టిక్కెట్లు బుక్ చేసుకున్న వారు ఏప్రిల్ 15 వరకూ ప్రయాణించవచ్చని ఎయిర్ ఏషియా వెల్లడించింది. సహజంగా జనవరి-మార్చి మధ్య కాలంలో విమానాల్లో ఆక్యుపెన్సీ రేషియో తక్కువ ఉంటుంది.

దీనికి ప్రధాన కారణం పరీక్షల సమయం దగ్గర పడటం ఒకెత్తు కావటంతో పర్యాటకుల సంఖ్య ఈ సమయంలో గణనీయంగా తగ్గుతుంది. దీంతో పాటు ఆర్ధిక సంవత్సరాంతం కూడా కావటంతో పారిశ్రామిక అవసరాల కోసం ప్రయాణించే వారి సంఖ్యలో కూడా తగ్గుదల ఉంటుంది. ఈ తరుణంలో ఖాళీగా ఉండే సీట్లను భర్తీ చేసుకునేందుకు పలు ఎయిర్ లైన్స్ ఆఫర్లు ప్రకటించటం ఆనవాయి. ప్రస్తుతం ఎయిర్ ఏషియా అదే బాట పట్టింది. రాబోయే రోజుల్లో మరిన్ని ఎయిర్ లైన్స్ కూడా ఇదే దారిలో ప్రయాణించే అవకాశం ఉందని సమాచారం.

Next Story
Share it