Telugu Gateway
Latest News

జియో యూజర్లకు షాక్!

జియో యూజర్లకు షాక్!
X

దేశ టెలికం రంగంలో ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచిన జియో తన వినియయోగదారులకు షాక్ ఇచ్చిందనే చెప్పొచ్చు. ఇంత కాలం జియో యూజర్లు ఏ ఫోన్ కు అయినా సరే ఉచితంగానే కాల్ చేసుకుంటూ వస్తున్నారు. ఇక నుంచి వేరే నెట్ వర్క్ కంపెనీల ఫోన్లకు కాల్ చేస్తే నిమిషానికి ఆరు పైసలు లెక్కన ఛార్జీ వసూలు చేయాలని జియో నిర్ణయించింది. అయితే జియో నెట్ వర్క్ యూజర్లకు మాత్రం ఎలాంటి ఛార్జీ ఉండదు. అయితే ఇందులో ఓ వెసులుబాటు కల్పించింది. కాల్ ఛార్జీల కింద వసూలు చేసే మొత్తానికి సంబంధించి ఆ మేరకు ఉచితంగా డేటాను ఇవ్వనున్నట్లు జియో ప్రకటించింది. ట్రాయ్ ఇచ్చిన నిబంధనల మేరకే ఇంటర్ కనెక్ట్ యూసేజ్ ( ఐయూసీ) ఛార్జీల కింద ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కంపెనీ చెబుతోంది.

కొత్తగా అమల్లోకి వచ్చిన ఇతర నెట్ వర్క్ నెంబర్లకు చేసే కాల్స్ కు సంబంధించి అక్టోబర్ 10 నుంచే ఛార్జీలు అమలు చేయనున్నారు. ఉచిత వాయిస్ కాల్స్ ను ఇవ్వటంతోపాటు ఇతర పోటీ సంస్థల కంటే అతి తక్కువ రేట్లకు డేటాను అందిస్తూ జియో టెలికం దేశంలో ఓ పెద్ద సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ట్రాయ్ ఆదేశాల మేరకే ఇలా చేయాల్సి వస్తోందని కంపెనీ తెలిపింది. మరి జియో తాజా నిర్ణయంపై వినియోగదారులు ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే.

Next Story
Share it