Telugu Gateway
Latest News

తాజ్ ప్రేమికులకు శుభవార్త

తాజ్ మహల్ సందర్శకులకు శుభవార్త. పున్నమి వెన్నెల్లో తాజ్ మహల్ చూడాలంటే ప్రస్తుతం అంత సులభం కాదు. ఎందుకంటే ఇఫ్పుడున్న నిబంధనల ప్రకారం నెలలో కేవలం ఐదు రోజులు మాత్రమే ఈ అవకాశం కల్పిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇక నుంచి ప్రతి రోజు కూడా రాత్రివేళ్లలో తాజ్ మహల్ ను సందర్శించే వెసులుబాటు కల్పించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇది అమల్లోకి వస్తే తాజ్ సందర్శకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

అంతే కాదు ప్రతి రోజు రాత్రంతా కూడా తాజ్ మహల్ లో సందర్శకులను అనుమతించనున్నారు. ఈ విషయాన్ని పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ వెల్లడించారు. రాత్రివేళ్లలో కూడా సందర్శకుల కోసం తాజ్ మహల్ ను తెరిచి ఉంచాలని పలు డిమాండ్లు వస్తున్నాయని..దీనికి అనుగుణంగానే నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు.దీంతో నెలలో ఎప్పుడైనా తాజ్ మహల్ ను రాత్రి వేళ్లలో వీక్షించాలనుకునే వారి కల నెరవేరనుంది.

Next Story
Share it