ఎయిర్ హోస్టెస్ పై గ్యాంగ్ రేప్

దేశ వాణిజ్య రాజధాని ముంబయ్ లో దారుణం జరిగింది. ఎయిర్ హోస్టేస్ పై గ్యాంగ్ రేప్ జరిగింది. చేసింది కూడా స్నేహితులే కావటం మరింత కలకలం రేపుతోంది. చివరకు బాధితురాలు పోలీసులను ఆశ్రయించి కేసు పెట్టింది. బాధితురాలు(25) అంథేరీలోని గోని నగర్లోని ఓ ఫ్లాట్లో నివాసం ఉంటోంది. ఉద్యోగరీత్యా ఎయిర్హోస్టెస్ అయిన సదరు యువతికి.. తమ కంపెనీలో పనిచేసే స్వప్నిల్ బడోడియాతో స్నేహం కుదిరింది. అతడు కూడా అదే వీధిలోని ఓ ఫ్లాట్లో పేయింగ్ గెస్ట్ గా ఉంటున్నాడు. మంగళవారం రాత్రి బాధితురాలిని డిన్నర్కు రావాల్సిందిగా ఆహ్వానించాడు. తెలిసిన వ్యక్తే కావటంతో ఆమెకు డిన్నర్ కు హాజరైంది. ఇద్దరు కలిసి ఫ్లాట్లో పార్టీ చేసుకున్నారు.
ఈ క్రమంలో ఆమెకు డ్రింక్ ఆఫర్ చేశాడు. అంతలోనే అతడి రూమ్మేట్స్ అక్కడికి చేరుకున్నారు. బాధితురాలు డ్రింక్ తిరస్కరించినప్పటికీ ఫ్రెండ్స్ ముందు పరువు పోతుందంటూ ఆమెతో తాగించాడు. అనంతరం అదే రాత్రి తన రూమ్మేట్స్ తో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఐపీసీ సెక్షన్ 376డీ కింద పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు. స్వప్నిల్ నేరం అంగీకరించాడని పోలీసులు చెబుతున్నారు.