Telugu Gateway
Latest News

కొత్త 20 రూపాయల నోట్ వచ్చింది

కొత్త 20 రూపాయల నోట్ వచ్చింది
X

దేశంలో కరెన్సీ కొత్త రూపు సంతరించుకుంటోంది. రెండు వేల రూపాయల దగ్గర నుంచి ఐదు వందలు, వంద, కొత్తగా రెండు వందల రూపాయల నోట్ ను కూడా తీసుకొచ్చారు. కొత్త కరెన్సీలో 50, 10 రూపాయల నోట్లు కూడా ఉన్నాయి. తాజాగా కొత్త 20 రూపాయల్ నోట్ వచ్చింది. కొత్త నోట్లు అందుబాటులోకి వచ్చినా పాత నోట్లు చెల్లుబాటు అవుతాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బిఐ) ప్రకటించింది. కొత్త 20 రూపాయల నోట్ త్వరలోనే మార్కెట్లోకి రానుంది. మహాత్మా గాంధీ సిరీస్‌లో ఉండే ఈ నోట్లు.. ఆకుపచ్చ, పసుపు కలిసిన రంగులో ఉన్నాయి.

ఈ నోటు నమూనాను ఆర్ బిఐ శనివారం ఓ ప్రకటనలో విడుదల చేసింది. ఈ నమూన ప్రకారం ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ సంతకం ఉండే ఈ నోటు ముందు భాగంలో మహాత్మాగాంధీ బొమ్మ, పక్కనే దేవనాగరి లిపిలో రూ.20 అని రాసి ఉంది. అలాగే అశోకుడి స్థూపం కూడా ఉంది. ఇక నోటు వెనకభాగంగంలో ఎల్లోరా గుహల చిత్రంతోపాటు స్వచ్ఛ భారత్‌ లోగో, నినాదం ఉన్నాయి. ఈ నోటు సైజు 63 mm x 129 mm గా ఉండనుంది.

Next Story
Share it