Telugu Gateway
Latest News

ఎన్టీఆర్ 25 లక్షలు...మహేష్ బాబు 25 లక్షల సాయం

ఎన్టీఆర్ 25 లక్షలు...మహేష్ బాబు 25 లక్షల సాయం
X

టాలీవుడ్ మొత్తం కష్టాల్లో ఉన్న కేరళకు సాయం చేసేందుకు ముందుకొస్తోంది. అగ్రహీరోలు అందరూ తమ వంతు సాయం ప్రకటిస్తున్నారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు 25 లక్షల రూపాయల సాయం ప్రకటించారు. మరో హీరో మహేష్ బాబు కూడా 25 లక్షలు ప్రకటిస్తే..సీనియర్ హీరో నాగార్జున మాత్రం 28 లక్షల రూపాయలు ప్రకటించారు. మరో హీరో ప్రభాస్ 25 లక్షలు, నందమూరి కళ్యాణ్ రామ్ పది లక్షల రూపాయలు ప్రకటించారు.

అల్లు అర్జున్, రామ్ చరణ్ లు ఇఫ్పటికే తమ విరాళాలు ప్రకటించారు. వరదలతో అతలాకుతలం అయిన కేరళలో ఇప్పటికే 350 మందికిపైగా మృత్యువాతకు గురయ్యారు. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ప్రకృతి ప్రకోపానికి చిగురుటాకులా వణికిన కేరళను ఆదుకునేందుకు దేశమంతటా కదిలివస్తోంది. ఇప్పటికే చిరు ఫ్యామిలీ మొత్తం ఆరవై లక్షల రూపాయలు కేరళ బాధితులకు అందించేందుకు ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఓ వైపు రాజకీయ నాయకులతో పాటు..సినీ ప్రముఖులు ఉదారంగా స్పందిస్తున్నారు.

Next Story
Share it