Telugu Gateway
Latest News

సెన్సెక్స్ 37000 పాయింట్ల కొత్త రికార్డు

సెన్సెక్స్ 37000 పాయింట్ల కొత్త రికార్డు
X

భారతీయ స్టాక్ మార్కెట్లు గురువారం నాడు కొత్త రికార్డులు నెలకొల్పాయి. దేశ చరిత్రలోనే తొలిసారి ముంబయ్ స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సెక్స్ 37000 పాయింట్ల మార్క్ ను దాటింది. దీంతో స్టాక్ మార్కెట్లో హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి. తొలిసారి సెన్సెక్స్ 37 వేల పాయింట్లను అధిగమించి 37014 పాయింట్లకు చేరింది. నిఫ్టీ కూడా రికార్డుల పరంగా కొత్త మార్క్ ను చేరుకుంది. ఈ ఏడాదిలో సెన్సెక్స్ 20 సార్లు రికార్డులను అధిగమించింది.

ఈ ఏడాది జనవరిలో 36 వేల పాయింట్ల వద్ద ఉన్న సెన్సెక్స్ తాజాగా గురువారం నాడు 37 వేల పాయింట్లను అధిగమించింది. మదుపర్లు పెద్ ఎత్తున బ్యాంకు, క్యాపిటల్ గూడ్స్ షేర్లను కొనుగోలు చేయటంతో సెన్సెక్స్ పరుగులు పెడుతూ ముందుకు సాగుతోంది. ఇందులో బ్యాంకు షేర్లు కూడా ఉన్నాయి.

Next Story
Share it