Telugu Gateway
Andhra Pradesh

విజయవాడ టూ సింగపూర్..డైరక్ట్ ఫ్లైట్స్

విజయవాడ టూ సింగపూర్..డైరక్ట్ ఫ్లైట్స్
X

విజయవాడ విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ సర్వీసుల ప్రారంభానికి రంగం సిద్ధం అయింది. వచ్చే నెల నుంచే విజయవాడ నుంచి సింగపూర్ కు డైరక్ట్ సర్వీసులు నడపనున్నట్లు సింగపూర్ సమాచార మంత్రి ఈశ్వరన్ ప్రకటించారు. ప్రభుత్వ కోరిక మేరకు ఈ సర్వీసులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈశ్వరన్ గురువారం నాడు విజయవాడలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో సమావేశం అయ్యారు. అమరావతిలో స్టార్టప్ ఏరియా అభివృద్ధి పనులను ఏపీ సర్కారు సింగపూర్ సంస్థలకే అప్పగించిన విషయం తెలిసిందే. ఈ ఒప్పందంలో ఈశ్వరన్ కీలక పాత్ర పోషించారు.

చట్టాన్ని సవరించి మరీ సింగపూర్ సంస్థలకు అనుకూలంగా సర్కారు నిర్ణయాలు తీసుకున్నా ఇంత వరకూ ఆ సంస్థలు పనులు ప్రారంభించలేదు. చంద్రబాబు, ఈశ్వరన్ సమక్షంలో ఏడీపీ, సింగపూర్ కన్సార్షియం మధ్య అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఏపీలో కన్ స్ట్రక్షన్,మెటీరియల్ సిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సింగపూర్ సంస్థలు దీనికి మరింత ఊపు వస్తుందని అన్నారు.

Next Story
Share it