Telugu Gateway
Top Stories

వెరైటీ...జిప్ మాస్క్ లు వచ్చాయి

వెరైటీ...జిప్ మాస్క్ లు వచ్చాయి
X

కరోనా కాలంలోనూ ఎవరి క్రియేటివిటి వారు చూపిస్తున్నారు. ఇప్పుడు ఓ హోటల్ కూడా అదే పని చేసింది. తమ హోటల్ కు వచ్చే కస్టమర్లు మాస్క్ లు తీయాల్సిన అవసరం లేకుండానే 'జిప్'లతో కూడిన మాస్క్ లు సరఫరా చేస్తోంది. దీంతో ఏదైనా తినే సమయంలో..తాగే సమయంలో మాస్క్ తీయకుండానే జస్ట్ జిప్ తీసేసి తమ పని పూర్తి చేసుకోవచ్చు. దీంతో చాలా వరకూ సేఫ్టీ ఉంటుంది. జిప్ లతో కూడిన మాస్క్ ల ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ జిప్ మాస్క్ లను పశ్చిమ బెంగాల్ లోని కోల్ కతాలో ఓ రెస్టారెంట్ అందజేస్తోంది. తమ కస్టమర్లకు ఎలాంటి అదనపు ఛార్జీ లేకుండానే ఈ మాస్క్ లను సరఫరా చేస్తున్నట్లు రెస్టారెంట్ నిర్వాహకులు వెల్లడించారు.

అయితే తమ హోటల్ కు వచ్చే వారు ఖచ్చితంగా ఈ తరహా మాస్క్ లు పెట్టుకోవాలనే నిబంధన ఏమీలేదని..ఇది వారి ఇష్టం అని తెలిపారు. అయితే మాస్క్ తీసి..పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా కస్టమర్ల సౌలభ్యం కోసం ఈ జిప్ మాస్క్ లు అందుబాటులోకి తెచ్చామన్నారు. ఇంతకు ముందు ఓ కంపెనీ మాస్క్ లు పెట్టుకుంటే గుర్తించటం కష్టం అవుతోందని, కోరుకున్న వారికి మాస్క్ లపై ఆయా వ్యక్తుల ఫోటోలను ముద్రించి మాస్క్ లను అమ్మింది. ఇప్పుడు కొత్తగా జిప్ మాస్క్ లు వచ్చాయి.

Next Story
Share it