Telugu Gateway
Top Stories

ఆర్ బిఐ గవర్నర్ కు కరోనా

ఆర్ బిఐ గవర్నర్ కు కరోనా
X

కరోనా కారణంగా దేశ ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలింది. ఈ పరిస్థితి ఒక్క భారత్ లోనే కాదు. ప్రపంచం అంతా ఇదే పరిస్థితి. కరోనాకు కారణమైన చైనా మాత్రం అందుకు భిన్నంగా ఉంది. దేశ ఆర్ధిక వ్యవస్థను నడిపించటంలో అత్యంత కీలక పాత్ర పోషించే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బిఐ) గవర్నర్ శక్తికాంత దాస్ కరోనా బారిన పడ్డారు. ఆయనే ట్విట్టర్ ద్వారా ఈ విషయం తెలిపారు. ఎలాంటి కరోనా లక్షణాలు లేకుండానే పాజిటివ్ గా తేలినట్లు గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు.

తాను ఆరోగ్యంగానే ఉన్నానని..అయితే తనతో కాంటాక్ట్ అయిన వారందరిని అప్రమత్తం చేసినట్లు తెలిపారు. ఐసోలేషన్ నుంచే పనిచేస్తున్నట్లు తెలిపారు. ఆర్ బిఐలో పని సాఫీగా సాగిపోతుందని..ఆర్ బిఐ డిప్యూటీ గవర్నర్స్ అందరితో టచ్ లో ఉన్నానని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్, టెలిఫోన్ ద్వారా సంప్రదింపులు జరపుతున్నట్లు తెలిపారు.

Next Story
Share it