Telugu Gateway
Top Stories

కేక్ లో మత్తు మందు కలిపి విద్యార్ధినిపై రేప్

కేక్ లో మత్తు మందు కలిపి విద్యార్ధినిపై రేప్
X

ఆ అమ్మాయి స్నేహితులే దారుణానికి ఒడిగట్టారు. పుట్టిన రోజు వేడుక అని ఓ హోటల్ కు పిలిచారు. అక్కడే మత్తు మందు కలిపిన కేక్ తినిపించి..అపస్మారక స్థితిలోకి వెళ్ళాక అత్యాచారం చేశారు. ఈ ఘటన హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో జరిగింది. రేప్ విషయం ఎవరికైనా చెపితే చంపేస్తామని బాలికను హెచ్చరించారు. సికింద్రాబాద్ లోని ఓ కాలేజీలో డ్రిగ్రీ చదువుతున్న ఆ యువతి వయస్సు 19 సంవత్సరాలు. ఆమె జూబ్లిహిల్స్ లో నివాసం ఉంటోంది. తమ ఇంటి చుట్టుపక్కల ఉండే రాములు, నవీన్ రెడ్డి, జోసెఫ్ లతో ఆమెకు స్నేహం ఉంది.

ఈ నెల 5న కాలేజీకి ఫీజు కట్టేందుకు అని వెళ్లింది. అక్కడే అమ్మాయిని ట్రాప్ చేశారు. తన పుట్టిన రోజు అని..అందరం కలసి సరదగా పార్టీ చేసుకుందామని వీరు ఓ పథకం ప్రకారం ఓ హోటల్ కు తీసుకెళ్ళారు. అక్కడే అత్యాచారానికి పాల్పడ్డారు. ఇటీవల ఆ యువతి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో తల్లిదండ్రులు ఆస్పత్రిలో చేర్పించారు. ఏమి జరిగిందో చెప్పాలని నిలదీయడంతో బాలిక అసలు విషయం బయటపెట్టింది. వారి ఫిర్యాదు మేరకు ముగ్గురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. జూబ్లిహిల్స్ పోలీసులు కేసు నమోదు...ఘటన జరిగిన ప్రాంతం అయిన సైబరాబాద్ కు బదిలీ చేశారు.

Next Story
Share it