Telugu Gateway
Top Stories

ప్రధాని మోడీకి కరోనా వ్యాక్సిన్ రెండవ డోసు

ప్రధాని మోడీకి కరోనా వ్యాక్సిన్ రెండవ డోసు
X

న్యూఢిల్లీలోని ఎయిమ్స్ లో ప్రధాని నరేంద్రమోడీ కోవిడ్ 19 వ్యాక్సిన్ రెండవ డోసు తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేసుకున్నారు. వైరస్ ను ఎదుర్కొనేందుకు ఉన్న పలు మార్గాల్లో వ్యాక్సినేషన్ కూడా ఒకటి అని పేర్కొన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ కోవిన్ యాప్ లో పేర్లు నమోదు చేసుకుని వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు.

ప్రధాని మోడీ హైదరాబాద్ లో భారత్ బయోటెక్ సంస్థ తయారు అయిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ తీసుకున్న విషయం తెలిసిందే. మార్చి 1న మోడీ వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు. దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకుంటున్న తరుణంలో పలు రాష్ట్రాల్లో వ్యాక్సిన్ కొరత తలెత్తుతోంది. కేంద్రంపై వ్యాక్సిన్ కోసం ఒత్తిడి పెరుగుతోంది. అదే సమయంలో దేశంలో కరోనా కేసులు కూడా రోజుకో కొత్త రికార్డు నమోదు చేస్తూ ముందుకు సాగుతున్నాయి.

Next Story
Share it