హ్యుండయ్ ఐ 20 బుకింగ్స్ ప్రారంభం
ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుండయ్ ఐ 20 బుకింగ్స్ ను ప్రారంభించింది. సరికొత్త హంగులతో కంపెనీ ఈ ఐ20ని అందుబాటులోకి తెచ్చింది. నవంబర్ 5న ఈ కారును మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. ఈ కారు కొనుగోలుకు ఆసక్తి ఉన్న వారు 21 వేల రూపాయలు అడ్వాన్స్ చెల్లించి కారు బుక్ చేసుకోవచ్చని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఆన్లైన్ బుకింగ్స్ కోసం అధికార వెబ్సైట్ను, ఆఫ్లైన్ బుకింగ్స్ కు హ్యుండయ్ డీలర్షిప్ను సందర్శించాలని తెలిపారు.
భారత్లో ప్రీమియం హాచ్బ్యాక్ ప్రమాణాలను మార్చే విధంగా ఈ మోడల్లో కొత్త టెక్నాలజీని వినియోగించామని కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. ఈ ఆల్-న్యూ ఐ20 ధర 6 లక్షల నుండి 10 లక్షల రూపాయల మధ్య ఉండవచ్చని అంచనా. కొత్త సంవత్సరం సందర్భంగా పలువురు కొత్త కార్లు కొనుగోలుకు ఆసక్తి చూపుతుంటారు. వీరిని టార్గెట్ చేసుకుని కంపెనీ కొత్త ఐ 20 విడుదల చేస్తోంది.