Telugu Gateway
Top Stories

తొలి విడత మూడు కోట్ల మందికి ఉచిత వ్యాక్సిన్

తొలి విడత మూడు కోట్ల మందికి ఉచిత వ్యాక్సిన్
X

భారత్ లో కీలకమైన వ్యాక్సిన్ కు సంబంధించి చకచకా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే నిపుణుల కమిటీ కోవిషీల్డ్ అత్యవసర వినియోగానికి సిఫారసు చేయగా..కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ కీలక ప్రకటన చేశారు. ఎవరూ పుకార్లను నమ్మవద్దని కోరారు. వ్యాక్సిన్ సమర్ధతను పరిశీలించాకే అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. తొలి విడత‌లో మూడు కోట్ల మంది ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌ కు ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వ‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. వీరిలో కోటి మంది హెల్త్‌ కేర్ వ‌ర్క‌ర్లు, రెండు కోట్ల మంది ఫ్రంట్‌లైన్ వ‌ర్క‌ర్లు ఉంటార‌ని వెల్లడించారు. అలాగే మరో 27 కోట్ల మంది వివ‌రాలు ఖరారు చేస్తున్నట్టు కేంద్రమంత్రి వివరించారు.

దేశవ్యాప్తంగా పలుచోట్లు అసలు వ్యాక్సిన్ ఇవ్వడం మినహా, డ్రిల్ సమయంలో మిగిలిన ప్రక్రియను అనుసరిస్తున్నట్లు హర్షవర్ధన్ తెలిపారు. ఢిల్లీలోని గురు తేగ్ బహదూర్ (జిటిబి) ఆసుపత్రిలో కోవిడ్-19 వ్యాక్సిన్‌ను అందించే డ్రై రన్‌ను సమీక్షించిన తరువాత హర్షవర్ధన్ మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా శనివారం నాడు కరోనా వ్యాక్సిన్‌ డ్రై రన్‌ కొనసాగింది. వ్యాక్సిన్‌ పంపిణీలో ఎదురయ్యే సమస్యలను గుర్తించడమే లక్ష్యంగా ఈ డ్రై రన్‌ సాగుతోంది. ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం డ్రై రన్‌ నిర్వహించింది. వీటితోపాటు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో డ్రై రన్‌ చేపట్టారు.

Next Story
Share it