Telugu Gateway
Top Stories

అమ్మాయిని వెతికేందుకు...ఖాకీల 'డీజిల్ డిమాండ్'

అమ్మాయిని వెతికేందుకు...ఖాకీల డీజిల్ డిమాండ్
X

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలపై ఎన్నో జోకులు పేలుతున్నాయి. కానీ ఇది సీరియస్ వ్యవహారం. కిడ్పాన్ అయిన అమ్మాయిని వెతికేందుకు పోలీసులు తమ వాహనాల్లో డీజిల్ పోయించాలని బాధిత మహిళను డిమాండ్ చేశారు. ఆ పేద మహిళ అప్పటికి 15 వేల రూపాయలు అప్పు చేసి మరీ..పోలీసులకు డీజిల్ పోయించింది. అయినా సరే వారిలో సరైన స్పందన లేకపోవటంతో ఆ మహిళ మీడియాకు గోడు వెళ్లబోసుకుంది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఉత్తరప్రదేశ్ లో ఈ ఘటన జరిగింది. కాన్పూర్‌కు చెందిన గుడియా అనే వికలాంగురాలి భర్త చనిపోయాడు. మైనర్‌ కుమార్తెతో కలిసి ఉన్న కొద్ది పాటి భూమిని సాగు చేసుకుని జీవిస్తోంది.

ఈ క్రమంలో నెల రోజుల క్రితం గుడియా మైనర్‌ కుమార్తెని ఆమె బంధువు ఒకరు కిడ్నాప్ చేశారు. దీంతో గుడియా పోలీస్‌ స్టేషన్‌లో దీని గురించి ఫిర్యాదు చేసింది. మూడు నాలుగు సార్లు డబ్బులు ఇచ్చిన్నప్పటికి ఫలితం మాత్రం శూన్యం. కుమార్తె గురించి ప్రశ్నిస్తే.. వెతుకుతున్నాం అంటూ సమాధానమిచ్చేవారు. ఆ తర్వాత అసలు పట్టించుకోవటమే మానేశారు. అంతే కాదు కిడ్నాప్ కు గురైన యువతిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీంతో బాధిత మహిళ ఈ అంశంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది.

Next Story
Share it