Telugu Gateway
Top Stories

ఛ‌లో గోవా అంటున్న సెల‌బ్రిటీలు

ఛ‌లో గోవా అంటున్న సెల‌బ్రిటీలు
X

సెల‌బ్రిటీలు అంద‌రూ నూత‌న సంవ‌త్స‌రానికి స్వాగ‌తం ప‌లికేందుకు ఎవ‌రికి న‌చ్చిన ప్లేస్ కు వారు చేరుకున్నారు. స‌హ‌జంగా క‌రోనా..ఒమిక్రాన్ భ‌యాలు లేక‌పోతే చాలా మంది కొత్త ఏడాది ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాల కోసం అంత‌ర్జాతీయ ప్ర‌యాణాలు పెట్టుకునేవారు. కానీ గ‌త రెండేళ్ల నుంచి క‌రోనా దెబ్బ నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల‌పై ప‌డుతూనే ఉంది. అంతా స‌ద్దుమ‌ణిగింది అనుకుంటున్న వేళ ఒమిక్రాన్ టెన్ష‌న్ ప్రారంభం అయింది. అయినా చాలా మంది దేశంలోని అత్యంత కీల‌క‌మైన గోవాలో మ‌కాం వేశారు. ముఖ్యంగా సెల‌బ్రిటీలు అంద‌రూ గోవానే టార్గెట్ చేసుకున్నారు. ఇదుగో తెలుగులో ప‌లు సినిమాల్లో మెరిసిన పాయ‌ల్ రాజ్ పుత్ గోవా బీచ్ లో ఇలా సూర్యాస్త‌మయాన్ని ఎంజాయ్ చేస్తోంది. ఈ ఫోటోను పాయ‌ల్ త‌న ఇన్ స్టా ఖాతాలో షేర్ చేసింది. పాయ‌ల్ రాజ్ పుత్ తోపాటు శ్ర‌ద్ధాదాస్ త‌దిత‌రులు గోవాలోనే మ‌కాం వేశారు.

చాలా మంది టాలీవుడ్, బాలీవుడ్ న‌టీ, న‌టులు అంద‌రూ ఇప్పుడు గోవా బాట ప‌ట్టారు. స‌హ‌జంగానే గోవా నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల‌కు పెట్టింది పేరు. అయితే ఇప్పుడు అక్క‌డ ఒకే ఒక్క ఒమిక్రాన్ కేసు మాత్ర‌మే ఉండ‌టంతో..ప్ర‌భుత్వం కూడా నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల‌పై ఎలాంటి ప‌రిమితులు..ఆంక్షలు పెట్ట‌లేదు. ఇది కూడా దేశంలో అత్యంత కీల‌క ప‌ర్యాట‌క ప్రాంతం అయిన గోవాకు వెళ్ళాల‌నుకునేవారికి మాత్రం సానుకూల అంశంగా మారింది. దీంతో పాటు సెల‌బ్రిటీలు స‌హ‌జంగానే గ్రూపులుగా ప్ర‌త్యేక రిసార్ట్ లు...ఖ‌రీదైన హోట‌ల్స్ బుక్ చేసుకుని జాగ్ర‌త్త‌లు తీసుకుంటార‌నే విష‌యం తెలిసిందే. అదే స‌మ‌యంలో వీరి ప్రైవ‌సీకి ఎలాంటి భంగం క‌ల‌గ‌ని ప్రాంతాల‌నే వీరు ఎంచుకుంటారు.

Next Story
Share it