గుంపులో గోవిందయ్య..నాకెందుకయ్య!
ఎందుకంటే ఇది కోట్లాది రూపాయల వ్యవహరం అన్న విషయం తెలిసిందే. ఓ వైపు కోరుకున్న పదవి దక్కకపోగా...వచ్చే వందల కోట్ల రూపాయల వ్యాపారాన్ని కాంగ్రెస్ కోసం వదులుకోవాల్సిన అవసరం ఏముంది అని నిర్ణయించుకున్న పీకె..కాంగ్రెస్ కు హ్యాండ్ ఇచ్చారని చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా నష్టం జరిగిందనే చెప్పాలి. ఇందులో ప్రశాంత్ కిషోర్ కు పెద్దగా పోయేది ఏమీలేదు. అసలే అంతంతమాత్రంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ నష్టాన్ని ఎలా పూడ్చుకుంటుంది అన్నది వేచిచూడాల్సిందే. కొత్త వ్యూహకర్తలను వెతుక్కుంటుందా...లేక స్వశక్తితోనే ముందుకు సాగుతుందా అన్నది వేచిచూడాల్సిందే.