Telugu Gateway
Telugugateway Exclusives

ఈ భోజనం తింటే...బుల్లెట్ ఫ్రీ

ఈ భోజనం తింటే...బుల్లెట్ ఫ్రీ
X

ఈ ఆఫర్ వెరైటీగా ఉన్నా కూడా నిజం. భోజనం తింటే బుల్లెట్ ఫ్రీ అంటూ ఓ ఆఫర్ తో ముందుకొచ్చింది ఆ రెస్టారెంట్. అది ఎక్కడ అంటే పూణేలో. పూణేకు సమీపంలో ఉన్న శివరాజ్ హోటల్ ఈ ఆసక్తికర ఆఫర్ తో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. అయితే హోటల్ నిర్దేశించిన సమయంలో కస్టమర్ ఈ భోజనాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. అరవై నిమిషాల వ్యవధిలో ఈ నాన్ వెజిటేరియన్ భోజనాన్ని పూర్తి చేసిన వారికి 1.65 లక్షల రూపాయల విలువైన రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్ ఇస్తామని ప్రకటించింది యాజమాన్యం. ఈ బుల్లెట్ థాలిలో 12 రకాల నాన్ వెజ్ వంటకాలు పెట్టనున్నారు. ఈ థాలి ఖరీదు 2500 రూపాయలు. ఇందులో మటన్, చేపలు, చికెన్, రొయ్యల బిర్యానీ వంటి ఎన్నో నోరూరించే వంటకాలు ఉంటాయి.

ఈ వంటకాల బరువు మొత్తం నాలుగు కేజీలు ఉంటుంది. కస్టమర్లను ఆకర్షించేందుకే ఈ ఆఫర్ పెట్టినట్లు హోటల్ యాజమాన్యం వెల్లడించింది. హోటల్ దగ్గర దీనికి సంబంధించిన బ్యానర్లు కూడా కట్టారు. అయితే తమ పోటీకి మంచి స్పందన వచ్చిందని చాలా మంది..ఇందులో పాల్గొనేందుకు ముందుకొచ్చారని నిర్వాహకుడు అతుల్ వైకర్ వెల్లడించారు. అంతే కాదు..మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాకు చెందిన సోమనాథ్ పవార్ గంటలోనే బుల్లెట్ థాలిని పూర్తి చేసి..బ్రాండ్ న్యూ రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్ ను ఎంచక్కా ఇంటికి తీసుకెళ్ళారు కూడా. దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేసున్నాయి.

Next Story
Share it