Telugu Gateway
Telangana

మ‌హీంద్రా నూత‌న షోరూమ్ ప్రారంభం

మ‌హీంద్రా నూత‌న షోరూమ్ ప్రారంభం
X

వీవీసీ మోటార్స్ కొత్త‌గా సనత్ నగర్ లో నూతన మహీంద్రా షోరూమ్‌ను ప్రారంభించింది. ఈ సంద‌ర్భంగా మహీంద్రా సౌత్ జోనల్ సేల్స్ హెడ్ బానేశ్వర్ బెనర్జీ, మహీంద్రా అండ్ మహీంద్రా రీజినల్ సేల్స్ మానేజర్ భూపేష్ కుమార్ , వీ.వీ.సీ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ వి.వి రాజేంద్రప్రసాద్ లు కలిసి బొలెరో నియో నూత‌న వాహ‌నాల‌ను మార్కెట్లోకి విడుదల చేశారు. సక్సెస్‌ఫుల్ బొలెరో ఎస్ యూవీని సరికొత్త ప్రీమియం ఫీచర్స్ , ఎడ్వాన్స్ సేఫ్టీ ఫీచర్స్ తో "బొలెరో నియో" పేరుతో మార్కెట్లోకి విడుదల చేసిన విష‌యం తెలిసిందే. స్కార్పియో, ధార్ ఎస్.యూ వీలకు వాడిన మూడవ జనరేషన్ ఛాసిస్ దీనికి వాడటంతో బిల్డ్ క్వాలిటీ స్ట్రాంగ్ గా ఉంటుంద‌ని కంపెనీ వెల్ల‌డించింది. సరికొత్త 6 స్లాట్ ఫ్రంట్ క్రోమ్ గ్రిల్ ఎట్రాక్టివ్ గా ఉంటుంది.ప్రీమియం ఇటాలియన్ ఇంటీరియర్స్,ఫాబ్రిక్ సీట్స్,రిమోట్ లాక్ అండ్ కీలెస్ ఎంట్రీ,7 ఈంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటెయిన్మెంట్ సిస్టం,క్రూయిజ్ కంట్రోల్ సిస్టం లాంటి కంఫర్ట్ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.

సేఫ్టీలో ఈ కొత్త బొలెరో నియో ది బెస్ట్. హై స్ట్రెంత్ స్టీల్ బాడీ,డ్యుయల్ ఎయిర్బ్యాగ్స్,ఏ.బీ.ఎస్ విత్ ఈ.బీ.డీ,ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ లాంటి సేఫ్టీ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. N4,N8 మరియు N10 మోడల్స్లలో రిలీజైన ఈ కొత్త బొలెరో నియో 8లక్షల 48వేల ఎక్స్ షోరూమ్ ప్రైజ్తో అన్ని వి.వి.సీ మహీంద్రా షోరూమ్లలో అందుబాటులో ఉంది. వి.వి.సీ కొత్తగూడ, హిమాయత్ నగర్, మలక్ పేట్ లలో షోరూంలను ప్రారంభించి కస్టమర్ల విశేష ఆదరణతో ముందుకు వెళుతోందని,కస్టమర్ల ఆదరణతో మరింత ఉత్సాహంతో అందరికీ మహీంద్రా కార్లు అందుబాటులో ఉండేవిధంగా ఇక్కడ సనత్ నగర్ లో నాలుగవ కొత్త మహీంద్రా అండ్ మహీంద్రా షోరూమ్ ని మా వి.వి.సీ డీలర్ షిప్ లో స్టార్ట్ చేయడం సంతోషంగా ఉందని మహీంద్రా వి.వి.సీ మేనేజింగ్ డైరెక్టర్ వి.వి.రాజేంద్రప్రసాద్ మీడియాకు తెలిపారు.

Next Story
Share it