Telugu Gateway
Telangana

టీఆర్ఎస్ గెలుపు తాత్కాలికమే

టీఆర్ఎస్ గెలుపు తాత్కాలికమే
X

మా టార్గెట్ 2023 అసెంబ్లీ ఎన్నికలే

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై బిజెపి తెలంగాణ ప్రెసిడెంట్ బండి సంజయ్ స్పందించారు. బిజెపిని ఓడించేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీ వందల కోట్ల రూపాయలు గుమ్మరించిందని ఆరోపించారు. అయినా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఓట్ షేర్ పెరిగిందని తెలిపారు. సంజయ్ ఆదివారం నాడు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ఓటమి లక్ష్యంగా కొన్ని పార్టీలు పని చేశాయని విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రంలో పుట్టగతులు లేవని సీఎం కేసీఆర్‌కు అర్థమైందని తెలిపారు. అందుకే సీఎం కేసీఆర్‌ బయటకు రాకుండా వేరే పార్టీ నేత ముఖం పెట్టుకుని వచ్చారని మండిపడ్డారు. బీజేపీతో టీఆర్ఎస్‌లో భయం పట్టుకుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ బెనిఫిట్స్ ఇవ్వాలన్నారు. బంగారు తెలంగాణలో గత పీఆర్సీ కంటే ఎక్కువ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ భయంతో కేసీఆర్ ముఖంలో నవ్వు కరువైందన్నారు.

ఉద్యోగులను మానసికంగా ఇబ్బంది పెట్టారని బండి సంజయ్‌ విమర్శించారు. పట్టభద్రులు టీఆర్ఎస్‌ మీద ప్రేమతో ఓటు వేయలేదన్నారు. పీఆర్సీ ఇవ్వరని భయపడే టీఆర్ఎస్‌కు ఓటేశారని తెలిపారు. పీఆర్సీ ఇవ్వకపోతే సీఎం కేసీఆర్‌ తలదించుకునేలా చేస్తామని తెలిపారు. ఉద్యోగ నోటిఫికేషన్‌, నిరుద్యోగ భృతి వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 70 శాతం మంది ఓటర్లు టీఆర్ఎస్‌ను వ్యతిరేకించారని అన్నారు. ఓట్లు చీలడం వల్లే టీఆర్ఎస్ గెలిచిందని, గుర్రం బోడు, భైంసా ఘటనలు, తమ నాయకులపై రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న దాడులను మరచిపోమని తెలిపారు. టీఆర్ఎస్ వాళ్లు వైజాగ్ వెళ్లినా ఎవరు పట్టించుకోరని బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు.

Next Story
Share it