Telugu Gateway
Telangana

షేక్ పేట్ ఎమ్మార్వోపై కేకే కుమార్తె దౌర్జన్యం

షేక్ పేట్ ఎమ్మార్వోపై కేకే కుమార్తె దౌర్జన్యం
X

కేసు పెట్టిన ఎమ్మార్వో

బంజారాహిల్స్ కార్పొరేటర్, టీఆర్ఎస్ ఎ:పీ కే. కేశవరావు కుమార్తె విజయలక్ష్మి వివాదంలో చిక్కుకున్నారు. ఆమె షేక్ పేట ఎమ్మార్వోపై దౌర్జన్యానికి దిగారు. అనుచరులతో కలసి హంగామా సృష్టించారు. దీనిపై తహశీల్దార్ శ్రీనివాసరెడ్డి పోలీసు స్టేషన్ లో కేసు పెట్టారు. విజయలక్ష్మీ తనపై దాడి చేసిందంటూ బుధవారం ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమెతో పాటు అనుచరులు షేక్‌పేటలోని తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి తనను దుర్భాషలాడడమే కాకుండా తన ఉద్యోగ విధుల రీత్యా హైకోర్టుకు వెళ్తుతుండగా అడ్డుకుని నెట్టివేశారని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

తాను ఎంపీ కేశవరావు కూతుర్ని అంటూ విజయలక్ష్మీ బెదిరింపులకు దిగారని ఆరోపించారు. ఈ మేరకు శ్రీనివాస్‌ రెడ్డి ఓ వీడియోను సైతం విడుదల చేశారు. బంజారాహిల్స్‌ డివిజన్‌ నుంచి రెండుసార్లు కార్పొరేటర్‌గా విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే గ్రేటర్‌ పీఠం ఈసారి మహిళకు రిజర్వు కావడంతో ఆమె హైదరాబాద్‌ మేయర్‌ అయ్యే అవకాశం ఉందంటూ టీఆర్‌ఎస్‌ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చసాగుతోంది. ఈ క్రమంలో ఆమె వివాదంలో చిక్కుకోవడం విశేషం.

Next Story
Share it