ప్రతి ఎన్నిక హుజురాబాద్ కాదు..ప్రతి అభ్యర్థి ఈటల కాలేరు!

ఎందుకు అంటే ప్రతి చోట ఈటల రాజేందర్ లాంటి వారు...కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్ని హంగులు ఉన్న వారు దొరకటం కష్టం. అంతే కాదు తాజాగా తెలంగాణలో జరిగిన ఎమ్మెల్యే ల కొనుగోళ్ల డ్రామా తో ఇప్పటికిప్పుడు ఎవరు అంత తొందర పడి బీజేపీ లో చేరరు అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మునుగోడు లో పడిన దెబ్బ తో బీజేపీ కూడా మరో ఉప ఎన్నికకు సాహసం చేయదు అని భావిస్తున్నారు. ఎందుకంటే అక్కడ కూడా మునుగోడు సీన్ రిపీట్ అయితే మరింత డామేజ్ అవుతుంది. అందుకే ఈ పని చేయరని భావిస్తున్నారు. టిఆర్ఎస్ పై మాట్లాడానికి లెక్క లేనన్ని ఇష్యూ ఉన్నందున ఇప్పుడు వాటిపై ఫోకస్ పెట్టి ఎలక్షన్ టైం లోనే చేరికలు..ఇతర అంశాలపై దృష్టి పెట్టడమే కరెక్ట్ అన్న చర్చ సాగుతోంది. మరి రాబోయే రోజుల్లే తెలంగాణ బీజేపీ ఎలాంటి వ్యూహం అనుసరిస్తోందో వేచి చూడాల్సిందే. ఇప్పుడు బీజేపీ కోసం ఏడాది ఉన్న పదవి కాలం వదులుకుని ఎవరు మునుకు వస్తారు...వచ్చినా ఒకవేళ మునుగోడు ఫలితం రిపీట్ అయితే అది పార్టీ కే కాకుండా పోటీ చేసి పరాజయం పలు అయిన వాళ్లకు కూడా రాజకీయంగా నష్టమే.



