ఎమ్మెల్యేల ఎర కేసు...కెసిఆర్ సర్కారుకు బిగ్ షాక్

అయితే ఆర్డర్ సస్పెన్షన్కు హైకోర్టు నిరాకరించింది. దీంతో ఇక సిబిఐ వెంటనే రంగంలోకి దిగటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ కేసు లో రాష్ట్ర ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుశ్యంత్ దవే వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు ముగిసిన అనంతరం జనవరి 18న హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ తీర్పును రిజర్వ్ చేశారు. ఈ అంశంపై సోమవారం తుది తీర్పు వెలువరించారు. దీంతో ఈ కేసు లో ఇంకా ఎన్ని ట్విస్టులు చోటు చేసుకుంటాయన్నది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది.