Telugu Gateway
Politics

దుబ్బాక ఎన్నిక టీఆర్ఎస్ కు లెక్కే కాదు

దుబ్బాక ఎన్నిక టీఆర్ఎస్ కు లెక్కే కాదు
X

ముఖ్యమంత్రి కెసీఆర్ దుబ్బాక ఉప ఎన్నికపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దుబ్బాక ఎన్నికలు టీఆర్ఎస్‌కు పెద్ద లెక్కే కాదన్నారు. దుబ్బాకలో మంచి మెజార్టీతో గెలవబోతున్నట్లు ధీమా వ్యక్తం చేశారు. చిల్లర తతంగాలు నడుస్తునే ఉంటాయి.. వాటిని పట్టించుకోమని స్పష్టం చేశారు. గ్రౌండ్‌ చాలా క్లియర్‌గా ఉందని వ్యాఖ్యానించారు. ధరణి పోర్టల్ ను ప్రారంభించిన తర్వాత సీఎం కెసీఆర్ మీడియాతో చిట్ చేశారు. ఇప్పటికే గెలుపు ఖాయం. అప్పటి వరకూ ఈ తతంగాలు నడుస్తూనే ఉంటాయి అని వ్యాఖ్యానించారు.

రాబోయే 15 రోజుల్లో నాన్ అగ్రికల్చర్ ఆస్తుల రిజిస్ట్రేషన్‌ కూడా ప్రారంభం అవుతుందని చెప్పారు. ప్రతి ఓపెన్ ప్లాట్ దారుడు నాన్ అగ్రికల్చర్ ఆస్తిగా నమోదు చేసుకోవాలని సూచించారు. ప్లాట్ల వివరాలు వెబ్‌సైట్‌లో కనిపించొద్దనుకుంటే హైడ్ ఆప్షన్ పెట్టుకోవచ్చని, పూర్తి టైటిల్ విషయంలో ఓనర్ నష్టపోతే ప్రభుత్వమే పరిహారం ఇస్తుందని కేసీఆర్‌ హామీ ఇచ్చారు.

Next Story
Share it