Telugu Gateway
Politics

ఐదు కోట్ల ప్రజల మనసులు గెలిచాం

ఐదు కోట్ల ప్రజల మనసులు గెలిచాం
X

పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పుపై వైసీపీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. తాము ప్రజలు ఆరోగ్యం, భద్రతపైనే దృష్టి పెట్టామన్నారు. సుప్రీంకోర్టులో తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చినా కూడా తాము ఐదు కోట్ల ప్రజల మనసు గెలిచామని ఓ ఛానల్ ప్రతినిధితో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. ప్రజల దృష్టిలో నిమ్మగడ్డ , చంద్రబాబు విలన్లుగా నిలిచిపోయారన్నారు. కోర్టు తీర్పు వారికి అనుకూలంగా ఉండొచ్చని వ్యాఖ్యానించారు.

Next Story
Share it