Telugu Gateway
Politics

కెటీఆర్ ఒక్కరే మాస్క్ తో

కెటీఆర్ ఒక్కరే మాస్క్ తో
X

హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్ నగర్ పట్టభద్రుల టిఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణి దేవి సోమవారం ఉదయమే టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసీఆర్ తో సమావేశం అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాణిదేవి గెలుపునకు అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రులు, ఆయా జిల్లాల ఎమ్మెల్యేలతో కెసీఆర్ చర్చలు జరిపారు. అనంతరం వాణికి బీ ఫాం అందజేశారు.

ఈ సమయంలో ఒక్క మంత్రి కెటీఆర్ తప్ప..ఎవరూ మాస్క్ లు పెట్టుకుని లేని విషయం స్పష్టంగా కన్పిస్తోంది. సీఎం కెసీఆర్ చుట్టూ టపదుల సంఖ్యలో ఉన్నా ఎవరూ మాస్క్ లు పెట్టుకోలేదు. కెసీఆర్ తో సమావేశం అనంతరం వాణి పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలతో కలసి తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. ఆ తర్వాత నామినేషన్ దాఖలు చేశారు.

Next Story
Share it