Telugu Gateway
Politics

నాపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోను

నాపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోను
X

తెలుగుదేశం పార్టీ విమర్శలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. వేరే ప్రాంతాల నుంచి బస్సుల్లో దొంగ ఓటర్లను తరలించి..మంత్రి పెద్దిరెడ్డి తిరుపతి ఉప ఎన్నికలో అక్రమాలకు పాల్పడుతున్నారని టీడీపీ శనివారం ఉధయం నుంచి విమర్శిస్తోంది. ఆయనకు చెందిన కళ్యాణమండపాల్లోనూ దొంగ ఓటర్లను పెట్టారని ఆరోపిస్తోంది. ఈ విమర్శలపై మంత్రి స్పందించారు. పోలింగ్‌పై టీడీపీ అబద్ధాలు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. శనివారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ, బస్సుల్లో వెళ్లే ప్రయాణికులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు.

ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్‌ను అడ్డుకునేందుకు టీడీపీ కుట్రలు చేస్తోందని విమర్శించారు. దొంగ ఓట్ల పేరుతో టీడీపీ డ్రామాలు ఆడుతోందని అన్నారు. ఓటమికి ముందే దొంగఓట్ల పేరుతో టీడీపీ సాకులు వెతుక్కుంటోందన్నారు. ''నాపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోను. రాజకీయ లబ్ధి కోసం వైసీపీపై అభాండాలు వేస్తున్నారు. టీడీపీ కుట్రలపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తాం. ఓటమి భయంతోనే చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు.'' పెద్దిరెడ్డి ఆరోపించారు.

Next Story
Share it