Telugu Gateway
Politics

పీ వీ కుమార్తెకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సీటు

పీ వీ కుమార్తెకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సీటు
X

ఊహించని ట్విస్ట్. నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీ పోస్టు వస్తుందనుకున్న దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహరావు కుమార్తె వాణిదేవిని అధికార టీఆర్ఎస్ పట్టభద్రుల నియోజకవర్గం బరిలో నిలిపింది. హైదరాబాద్ – రంగారెడ్డి - మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజికవర్గం ఎమ్మెల్సీ స్థానానికి సురభి వాణీదేవిని పేరును ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఖరారు చేశారు.

వాణీదేవి సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. అసలు ఈ స్థానంలో టీఆర్ఎస్ పోటీ చేస్తుందా లేదా అన్న అంశంపై సస్పెన్స్ కొనసాగుతూ వచ్చింది. అయితే సస్పెన్స్ కు తెరదించుతూ కెసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ కు టీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని కూడా జోరుగా ప్రచారం సాగింది. మరో సీటు ఖమ్మం-వరంగల్‌-నల్గొండ స్థానానికి ప్రస్తుత సిట్టింగ్‌ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డిని ఖరారు చేసిన విషయం తెలిసిందే.

Next Story
Share it