Telugu Gateway
Politics

హైదరాబాద్ లో ఆందోళనలకు బిజెపి కుట్ర

హైదరాబాద్ లో ఆందోళనలకు బిజెపి కుట్ర
X

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటీఆర్ బిజెపిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దుబ్బాక ఉప ఎన్నికలో ఎలాగైనా గెలిచేందుకు బిజెపి హైదరాబాద్ లో కుట్రలు చేసేందుకు రెడీ అయిందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన ఆదివారం నాడు తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. 'హైదరాబాదులో డిజిపి కార్యాలయం లేదా ప్రగతి భవన్, తెలంగాణ భవన్ ముట్టడి పేరుతో తమ చివరి కుప్రయత్నానికి తెరలేపి తద్వారా హైదరాబాద్లో లాఠీఛార్జ్, లేదా పోలీసు కాల్పులకు బిజెపి కుట్రలు పన్నుతోం ది. బీజేపీ డబ్బుల డ్రామా ఫెయిల్ అయింది. బిజెపి దుబ్బాకలో ప్రజలను మభ్యపెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా భారీ ఎత్తున డబ్బు పట్టుబడుతుంది. ఈరోజు కోటి రూపాయలు హైదరాబాద్ టాస్క్ ఫోర్సు పోలీసులు పట్టుకున్నారు. గోబెల్స్ కి పాఠాలు చెప్పే మాదిరి సామాజిక మాధ్యమాల్లో విస్తృతమైన విషప్రచారాన్ని, దుష్ప్రచారం, అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి వాటన్నింటినీ టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ప్రతినిధులు ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు చేరుస్తున్నారు.

ఎల్లుండి ఎన్నికలు కనుక ఈ రోజు చివరి కుట్రకు బిజెపి తెర లేపుతోంది. డ్రామా లో భాగంగా చివరి దశ వరకు బిజెపి తెరలేపింది. బిజెపి కార్యకర్త ఆత్మహత్య ప్రయత్నాన్ని అవకాశంగా మలుచుకుని, బిజెపి కుటిల ప్రయత్నాలు చేస్తోందని సమాచారం ఉంది. బిజెపి పార్టీలోని నాయకులే మాకు సమాచారం అందించారు. ఇలాంటి సమాచారాన్ని రూడీ చేసుకొని తగిన చర్యలు తీసుకోవాలని డిజిపిని కోరుతున్నాం. ఈ మేరకు బీజేపీ కుట్రల పట్ల తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎలక్షన్ కమిషనర్ తో పాటు రాష్ట్ర ఎన్నికల అధికారి మరియు రాష్ట్ర డిజిపి కి మా పార్టీ ప్రతినిధుల బృందం కలుస్తుంది. నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఏ పార్టీ ప్రయత్నించిన ఉక్కుపాదంతో అణిచివేయాలని రాష్ట్ర డిజిపిని టిఆర్ఎస్ పార్టీ కోరుతుంది. ఇంత నీచమైన కుట్రలకు పాల్పడుతున్న బిజెపి అబద్ధాలు, అసత్యాలు డ్రామాలు, డబ్బులు, అవసరమైతే శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ప్రజలకు గుర్తించి జాగ్రత్తగా ఉండాలని ఆ మేరకు నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాను. బిజెపి లాంటి రాజకీయ శక్తి పట్ల దుబ్బాక జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాను' అని పేర్కొన్నారు.

Next Story
Share it