Telugu Gateway
Politics

దేశ దొంగలు అంతా గుజరాత్ నుంచే

దేశ దొంగలు అంతా గుజరాత్ నుంచే
X

కెసీఆర్ నేటితరం గాంధీ

అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి బిజెపి నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దేశ దొంగలు అంతా గుజరాత్ నుంచే ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం కెసీఆర్ నేటితరం గాంధీ అని పేర్కొన్నారు. కాంగ్రెస్, బిజెపి నేతలు స్టువర్ట్ పురం దొంగలు,,గాడ్సే వారసులు అంటూ విమర్శలు చేశారు. 'బండి సంజయ్ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నావ్‌.. మా నేతలంతా కలిసి తిడితే నువ్వు ఏ గ్రామంలో తిరగలేవు. మా సీఎం ఆదేశిస్తే.. మేము తిట్టడం స్టార్ట్ చేస్తే నువ్వు తట్టుకోలేవు. బాండ్ పేపర్ మీద పసుపు బోర్డు గురించి రాసిచ్చిన ధర్మపురి అరవింద్.. ఇప్పటికి తీసుకురాలేదు. కిషన్ రెడ్డి ఒక్క రూపాయి కూడా హైదరాబాద్‌కి తీసుకురాలేదు' అన్నారు.

జీవన్ రెడ్డి టీఆర్ఎస్ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. 'వలస కార్మికులను ప్రధాని నరేంద్ర మోదీ ఫుట్ బాల్ ఆడుకున్నారు. నల్లధనం తీసుకొస్తా అని చెప్పి ఇప్పటికి తేలేదు. గుజరాత్ వాళ్లకు మాత్రమే పదవులు ఇస్తారు. మోదీ ఒంటి మీద ఉన్న వస్తువులు, కార్లు అన్ని విదేశాలవే. కానీ ఆయన మాత్రం మేక్‌ ఇన్‌ ఇండియా అంటారు. రైతులతో పెట్టుకున్నోడు ఈ దేశంలో ఎవడు బాగు పడలేదు. తరుణ్ చుగ్ నీ రాష్ట్ర రైతుల సంగతి చూసుకో. మేము దంచుడు స్టార్ట్ చేస్తే అరవింద్ బోధన్ నుంచి కోరుట్ల పోలేడు.. బండి సంజయ్ కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కి రాలేడు' అంటూ మండిపడ్డారు.

Next Story
Share it