Telugu Gateway
Cinema

దర్శకుడు లేకుండా సెలెబ్రేషన్స్ ఏంటో?

దర్శకుడు లేకుండా సెలెబ్రేషన్స్ ఏంటో?
X

ఏ సినిమా విజయంలో అయినా...పరాజయంలో అయినా దర్శకుడిదే కీలక పాత్ర. ఇది అందరూ ఒప్పుకునే మాట. స్టార్ హోదాలో ఉన్న నటీ, నటులు ఎప్పుడైనా అంతా మా ఇష్టం అన్నా దాన్ని సెట్ చేయాల్సిన బాధ్యత కూడా దర్శకుడిదే. టాలీవుడ్ లో టాప్ హీరోల్లో ఒకరిగా ఉన్న మహేష్ బాబు ఎప్పుడూ దర్శకుడి వ్యవహారాల్లో జోక్యం చేసుకున్న దాఖలాలు లేవు...అలాంటి పుకార్లు కూడా ఎప్పుడూ బయటకు రాలేదు. కొంత మంది హీరోల విషయంలో ఇలాంటి విమర్శలు వచ్చినా మహేష్ బాబు మాత్రం ఇలాంటి వాటికీ దూరం అనే చెప్పాలి. ఇప్పుడు ఇది అంతా ఎందుకు అంటే సంక్రాంతి కి విడుదల అయినా మహేష్ బాబు సినిమా గుంటూరు కారం సెలెబ్రేషన్స్ జరిగాయి తాజాగా. హీరో మహేష్ బాబు చిత్ర టీం తో పాటు తన సన్నిహితులకు పార్టీ ఇచ్చారు.దీనికి సంబదించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

అంతా బాగానే ఉంది కానీ...ఈ గుంటూరు కారం సెలెబ్రేషన్స్ ఫొటోల్లో ఎక్కడా కూడా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కనిపించటకపోవటం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు యాక్షన్ దుమ్మురేపినా కూడా కథలో దమ్ములేకపోవటం వల్లే సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకుంది అని...దీనికి అంతటికి కారణం దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాసే కారణం అంటూ సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.మహేష్ బాబు ఫ్యాన్స్ తో సినీ ప్రేమికులు కూడా ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ట్రోలింగ్. విమర్శలకు బయపడి అయన ఈ సెలెబ్రేషన్స్ కు దూరంగా ఉన్నారా..లేక మారేదైనా కారణం ఉందా అన్న విషయం తేలాల్సి ఉంది. సంక్రాంతి పండగ రోజు మహేష్ బాబు ఇచ్చిన పార్టీ లో హీరోయిన్లు శ్రీలీల, మీనాక్షి చౌదరి, నిర్మాత నాగ వంశీ, దిల్ రాజు తదితరులు కనిపించారు. ఈ సినిమాకు మూడు రోజుల్లోన్ నూట అరవై నాలుగు కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

Next Story
Share it