Telugu Gateway
Cinema

మిస్ శెట్టి స్కిప్ వెనక అసలు నిజం ఇదే!

మిస్ శెట్టి స్కిప్ వెనక అసలు నిజం ఇదే!
X

సినిమా అంటేనే మాయా ప్రపంచం. అదో అందమైన అబద్దం అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే మన హీరో లు చేసే ఫైట్స్ దగ్గర నుంచి సినిమాల్లో కనపడే విషయాలు ఏవీ నిజం కాదు కాబట్టి. ఇప్పుడు సాంకేతిక పరిజ్ణానం పెరగటంతో ఈ మాయ మరింత పెరుగుతుంది. ఇప్పుడు ఇది అంతా ఎందుకు అంటే మిస్ శెట్టి..మిస్టర్ పోలిశెట్టి సినిమాకు సంబదించిన విషయం. నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి కలిసి నటించిన ఈ సినిమా మంచి టాక్ దక్కించుకుంది. చాలా గ్యాప్ తర్వాత వీళ్లిద్దరి సినిమా సెప్టెంబర్ 7 న విడుదల అయిన విషయం తెలిసిందే. సినిమా విడుదలకు ముందు...సినిమా విడుదల తర్వాత కూడా హీరోయిన్ అనుష్క శెట్టి అసలు ఎక్కడా ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొనలేదు. కానీ మధ్యలో ఒక వీడియో మాత్రం విడుదల చేశారు. హీరోయిన్లల్లో ఒక్క నయనతార మాత్రమే ప్రమోషన్స్ కు హాజరు కారు. ఎంత పెద్ద హీరో అయినా ఆమె ఇదే మోడల్ ఫాలో అవుతారు. సినిమా ఓకే చేసే సమయంలోనే నయనతార ఈ విషయాన్నీ స్పష్టంగా చెపుతారు అని టాలీవుడ్ టాక్. కానీ అనుష్క అలా కాదు..గతంలో తాను నటించిన సినిమాలు అన్ని ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొన్న విషయం తెలిసిందే.

అయితే ఈ సారి అనుష్క తన సినిమా మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి ప్రమోషన్స్ లో పాల్గొనకపోవడం వెనక బలమైన కారణం ఉంది అని టాలీవుడ్ లో చర్చ సాగుతోంది. అదేంటి అంటే ఈ సినిమాలో అనుష్క ను చాలా స్లిమ్ గా, క్యూట్ గా చూపించారు. కానీ వాస్తవం వేరు. ఇది అంతా సిజీ తో పాటు ఇతర టెక్నీక్స్ వాడి చేసిన మాయాజాలంగా చెపుతున్నారు. కారణాలు ఏమైనా అనుష్క గత కొన్ని సంవత్సరాలుగా లావు అయ్యారు. ఎంత ప్రయత్నం చేసినా తన పూర్వ స్థితికి రాలేక పోతున్నారు అని...ప్రమోషన్స్ కోసం బయటకు వస్తే అసలు విషయం బయటపడుతుంది అనే ఆమె వీటిని స్కిప్ చేశారు అని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. హీరో నవీన్ పోలిశెట్టి తో పాటు చిత్ర యూనిట్ కు కూడా అనుష్క ప్రమోషన్స్ కు దూరంగా ఉండటంపై పలు ప్రశ్నలు ఎదురైన విషయం తెలిసిందే. సైజు జీరో సినిమా కోసం బాగా లావు అయిన అనుష్క తర్వాత ఈ బరువు తగ్గేందుకు పలు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం ఉంది.

Next Story
Share it