Telugu Gateway
Cinema

'వ‌రుడు కావ‌లెను' ట్రైల‌ర్ అదిరింది

వ‌రుడు కావ‌లెను ట్రైల‌ర్ అదిరింది
X

నాగశౌర్య‌, రీతూ వ‌ర్మ జంట‌గా న‌టించిన సినిమానే 'వ‌రుడు కావ‌లెను'. ఇప్ప‌టికే సెన్సార్ పూర్తి చేసుకున్న సినిమా అక్టోబ‌ర్ 29న ప్రపంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. ఈ సినిమా ట్రైల‌ర్ ను ప్ర‌ముఖ హీరో ద‌గ్గుబాటి రానా గురువారం సాయంత్రం విడుద‌ల చేశారు. 'భూమి ఆకాశం ఎదురెదురుగా ఉన్నా ఎప్ప‌టికి క‌ల‌వ‌లేవు. ఒక‌సారి చ‌దివేసిన పుస్త‌కాన్ని మ‌ళ్ళీ చ‌దివితే క‌థ మారుతుందా?. లేక ముగింపు మారుతుందా?. మారుతుంద‌ని ఆశ ప‌డ‌టం పిచ్చిత‌నం.

పొగ‌రుబోతుల‌కు క‌నున ప్రీమియ‌ర్ లీగ్ ఉంటే..ప్రతి సీజన్ లో ఆమే విన్న‌ర్ తెలుసా?. ' వంటి ప‌వ‌ర్ పుల్ డైలాగ్ లో వ‌రుడు కావ‌లెను ట్రైల‌ర్ ఆక‌ట్టుకుంది. టీజ‌ర్, ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాలు పెంచాయ‌న‌టంలో ఏ మాత్రం సందేహం లేదు. హారికా హాసిని బ్యాన‌ర్ పై నిర్మించిన ఈ చిత్రానికి ల‌క్ష్మీ సౌజ‌న్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమాలోని పాట‌లు కూడా ప్రేక్షకుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి.

Next Story
Share it