Telugu Gateway
Cinema

హైదరాబాద్ మెట్రోలో 'వకీల్ సాబ్'

హైదరాబాద్ మెట్రోలో వకీల్ సాబ్
X

జనసేన అధినేత, టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ గురువారం నాడు హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించారు. వకీల్ సాబ్ షూటింగ్ నిమిత్తం ఆయన మాదాపూర్ నుంచి మాయాపూర్ వరకూ మెట్రోలో ప్రయాణించారు. పవన్ కళ్యాణ్ తోపాటు చిత్ర నిర్మాత దిల్ రాజు కూడా ఉన్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరస పెట్టి సినిమాలు పూర్తి చేస్తున్నారు. అంతే కాదు కొత్త ప్రాజెక్టులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. తాజాగా ఆయన ఓ మళయాళ రీమేక్ కు ఓకే చెప్పిన విషయం తెలిసిందే. మెట్రో ప్రయాణంలో భాగంగా అమీర్ పేట స్టేషన్లో ట్రైన్ మారారు ఈ సందర్భంలో తోటి ప్రయాణికులతో సంభాషించారు. మియాపూర్ వెళ్లే ట్రైన్ లో పవన్ కళ్యాణ్ పక్కన ద్రాక్షారామం, సత్యవాడ ప్రాంతాల వారు కూర్చున్నారు.

ద్రాక్షారామం చెందిన చిన సత్యనారాయణ అనే రైతుతో మాట్లాడారు. పంటల గురించి, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. చిన సత్యనారాయణ మాట్లాడుతూ ఇటీవలి వర్షాలకు వ్యవసాయం బాగా దెబ్బతింది అని చెప్పారు. తమ ప్రాంతంలోనూ, కుటుంబంలోనూ చాలామంది మీ అభిమానులు ఉన్నారు.. ఈ ప్రయాణంలో మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది అని ఆనందం వ్యక్తం చేశారు. మెట్రో ట్రైన్ ప్రయాణం తనకు మొదటిసారి అని ఆ రైతు చెప్పగానే పవన్ కళ్యాణ్ గారు నవ్వుతూ మీకే కాదు నాకు కూడా మెట్రో ప్రయాణం ఇదే మొదటిసారి అని అన్నారు.

Next Story
Share it