Telugu Gateway
Cinema

టీవీ నటిపై కత్తితో దాడి..పెళ్లికి నో చెప్పిందనే!

టీవీ నటిపై కత్తితో దాడి..పెళ్లికి నో చెప్పిందనే!
X

ముంబయ్ లో దారుణం చోటుచేసుకుంది. పెళ్ళికి నిరాకరించిందని టీవీ నటి మాల్వీ మల్హోత్రాపై ఓ వ్యక్తి దాడికి దిగాడు. కత్తితో ఆమెపై దాడి చేసి పారిపోయాడు. ఫేస్ బుక్ పరిచయంతో ఆ వ్యక్తి తనను పెళ్ళాడాల్సిందిగా నటి మాల్వీని కోరాడు. అందుకు ఆమె నో చెప్పటంతో దాడికి దిగాడు. ముంబయ్ లోని వెర్సోవా ప్రాంతంలోని ఓ కేఫ్ నుంచి మాల్వీ ఇంటికి వెళుతున్న సమయంలో కుమార్ మహిపాల్ సింగ్ అనే వ్యక్తి కత్తితో దాడికి దిగాడు. అతగాడు చిత్ర పరిశ్రమలో నిర్మాత అని చెబుతున్నారు.

దాడికి ముందు ఆమెతో నిందితుడు వాదనకు దిగాడు. తనను ఎందుకు పట్టించుకోవటంలేదని, దూరం పెట్టడానికి కారణాలేంటని ప్రశ్నించాడు. ఈ సమయంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఆ తర్వాతే సింగ్ నటి మాల్వీ కత్తితో దాడికి దిగాడు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆమెకు ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. దాడికి పాల్పడిన వ్యక్తిపై ఐపీసీ సెక్షన్ 307 తోపాటు పలు సె క్ష న్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.

Next Story
Share it