Telugu Gateway
Cinema

హీరోలంద‌రూ 'పాతిక ల‌క్షల‌కు ఫిక్స్!'

హీరోలంద‌రూ పాతిక ల‌క్షల‌కు ఫిక్స్!
X

సాయం ఎవ‌రెంత చేయాల‌న్న‌ది వాళ్లిష్టం. దీనికి డిమాండ్స్ ఉండ‌వు. ఎవ‌రైనా డిమాండ్ చేసినా అది క‌రెక్ట్ కాదు. కొంత మంది అస‌లు ఇవ్వ‌క‌పోయినా ఎవ‌రూ ఏమీ అన‌రు. కానీ ఇటీవ‌ల ఏపీలో కురిసిన భారీ వ‌ర్షాలు..వ‌ర‌ద‌ల‌తో రాయ‌ల‌సీమ‌లోని చిత్తూరు, అనంత‌పురం, క‌డ‌ప జిల్లాతోపాటు నెల్లూరు జిల్లా కూడా భారీగా న‌ష్ట‌పోయింది. దీనికి స్పందించిన టాలీవుడ్ టాప్ హీరోలు బుధ‌వారం సాయంత్రం స్పందించారు. తొలుత ఎన్టీఆర్ తాను ఏపీ వ‌ర‌ద బాధితుల స‌హాయార్ధం 25 ల‌క్షల రూపాయ‌లు విరాళంగా అందివ్వ‌నున్న‌ట్లు ప్ర‌కటించారు. ఆ త‌ర్వాత మ‌హేష్ బాబు, చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ ల నుంచి ఇలాగే ప్ర‌క‌ట‌న‌లు వ‌చ్చాయి.

విచిత్రం ఏమిటంటే అంద‌రూ ఏదో కూడబ‌లుక్కున్న‌ట్లు పాతిక ల‌క్షల రూపాయ‌లే ప్ర‌క‌టించారు. స‌హ‌జంగా ఇలాంటి స‌మ‌యాల్లో ఎవ‌రికితోచినంత వారు సాయం చేస్తారు. అయితే ఎక్కువ‌సార్లు ఈ నెంబ‌ర్ మ‌ధ్య తేడాలు ఉంటాయి. కొంత మంది ఎక్కువ ఇస్తారు..మ‌రికొంత మంది త‌మ‌కు తోచినంత ఇస్తారు. కానీ ఈ సారి అలా కాకుండా అంతా పాతిక ల‌క్షల రూపాయ‌ల‌కే ఫిక్స్ అయి ప్ర‌క‌టించిన‌ట్లు క‌న్పిస్తోంది. మ‌హేష్ బాబు త‌న వంతు సాయం ప్ర‌క‌టించట‌మే కాకుండా ప్ర‌తి ఒక్కరూ ముందుకొచ్చి క‌ష్టాల్లో ఉన్న ఏపీని ఆదుకోవాల‌ని కోరారు. మిగిలిన హీరోలు అంతా ఇంకా స్పందించాల్సి ఉంది.

Next Story
Share it