Telugu Gateway
Cinema

బ్రాండ్ వేల్యూలోనూ దుమ్మురేపుతున్న అల్లు అర్జున్

బ్రాండ్ వేల్యూలోనూ దుమ్మురేపుతున్న అల్లు అర్జున్
X

అల్లు అర్జున్ అటు సినిమాల్లోను...ఇటు బ్రాండ్ వేల్యూ లోనూ అదరగొడుతున్నారు. 2022 సంవత్సరానికి సంబంధించి దేశంలో అత్యంత బ్రాండ్ వేల్యూ కల టాప్ 25 సెలబ్రిటీల్లో టాలీవుడ్ నుంచి ఒక్క అల్లు అర్జున్ కు మాత్రమే చోటు దక్కటం విశేషం. ఇక్కడ మరో విశేషం ఏమిటి అంటే పుష్ప హీరో అల్లు అర్జున్ ఈ జాబితాలో 20 వ ప్లేస్ లో ఉంటే..ఇదే సినిమాలో అల్లు అర్జున్ కు జోడిగా నటించిన రష్మిక మందన్న కూడా 25 వ స్థానంలో ఉండటం విశేషం. బాలీవుడ్ తో పోలిస్తే 2022 సంవత్సరంలో ఎక్కువ టాలీవుడ్ సినిమాలే వసూళ్ల విషయంలో ముందు వరసలో ఉండటంతో పలు కంపెనీలు కూడా తెలుగు నటుల వైపు చూస్తున్నాయి. తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావటం తో ఈ సినిమా హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ ల బ్రాండ్ వేల్యూ పెరిగే అవకాశం ఉంది అనే అంచనాలు కూడా ఉన్నాయి.

ఇప్పుడు అయితే టాప్ ట్వంటీ ఫైవ్ లో ఒక్క అల్లు అర్జున్ మాత్రమే ఉన్నారు. అల్లు అర్జున్ బ్రాండ్ విలువ 260 కోట్ల రూపాయలు అయితే...రష్మిక మందన్న బ్రాండ్ విలువ 209 కోట్ల రూపాయలతో 25 వ స్థానంలో ఉన్నారు. ఆర్థిక సలహాల సంస్థ క్రోల్ తాజాగా ఈ జాబితా విడుదల చేసింది. దీని ప్రకారం 1500 కోట్ల రూపాయల బ్రాండ్ వేల్యూ తో బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ మొదటి స్థానంలో ఉన్నారు. రెండవ ప్లేస్ లో క్రికెటర్ విరాట్ కోహ్లీ ఉంటే...అయన బ్రాండ్ వేల్యూ 1450 కోట్లు ఉంది. ఆ తర్వాత అక్షయ్ కుమార్, అలియా భట్, దీపికా పాడుకొనే, పీవీ సింధు, హార్దిక్ పాండ్య, నీరజ్ చోప్రా తదితరులు టాప్ 25 జాబితాలో చోటు దక్కించుకున్నారు.

Next Story
Share it