బ్రాండ్ వేల్యూలోనూ దుమ్మురేపుతున్న అల్లు అర్జున్
ఇప్పుడు అయితే టాప్ ట్వంటీ ఫైవ్ లో ఒక్క అల్లు అర్జున్ మాత్రమే ఉన్నారు. అల్లు అర్జున్ బ్రాండ్ విలువ 260 కోట్ల రూపాయలు అయితే...రష్మిక మందన్న బ్రాండ్ విలువ 209 కోట్ల రూపాయలతో 25 వ స్థానంలో ఉన్నారు. ఆర్థిక సలహాల సంస్థ క్రోల్ తాజాగా ఈ జాబితా విడుదల చేసింది. దీని ప్రకారం 1500 కోట్ల రూపాయల బ్రాండ్ వేల్యూ తో బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ మొదటి స్థానంలో ఉన్నారు. రెండవ ప్లేస్ లో క్రికెటర్ విరాట్ కోహ్లీ ఉంటే...అయన బ్రాండ్ వేల్యూ 1450 కోట్లు ఉంది. ఆ తర్వాత అక్షయ్ కుమార్, అలియా భట్, దీపికా పాడుకొనే, పీవీ సింధు, హార్దిక్ పాండ్య, నీరజ్ చోప్రా తదితరులు టాప్ 25 జాబితాలో చోటు దక్కించుకున్నారు.