టాలీవుడ్ కు టిక్కెట్ రేట్ల షాక్

చివరకు ఇలా ప్రచారం చేసుకుంటున్నారు!
అతి ఎక్కడైనా అనర్ధమే. టాలీవుడ్ కు ఇప్పుడు ఈ విషయం బాగా అర్ధం అయినట్లు ఉంది. దొరికిన వాళ్ళను దొరికినంత మేర పిండుకుందామని ప్లాన్ చేశారు. కొన్ని పెద్ద సినిమాలు నడిచిపోయాయి. కానీ అసలు సీన్ ఆ తర్వాతే మొదలైంది. ఎంత పెద్ద మెగాస్టార్ అయినా..మెగా పవర్ స్టార్ అయినా సరే మేం చూడం అన్నారు ఆచార్య సినిమా విషయంలో. అసలే సినిమా అంతంత మాత్రం..పైగా టిక్కెట్ రేట్లు ఓ రేంజ్ లో ఉన్నాయి. దీంతో సినీ అభిమానులకు చిర్రెత్తుకొచ్చింది. అంతే తమ షాక్ ఎలా ఉంటుందో చూపించారు..చూపిస్తున్నారు కూడా. ఎఫ్3 చిత్ర యూనిట్ కూడా ముందే ప్రమాదాన్ని పసిగట్టి తాము పాత రే్ట్లతోనే సినిమా చూపిస్తున్నామని..రేట్లు పెంచటం లేదని ప్రత్యేకంగా ప్రచారం చేసుకోవాల్సి వచ్చింది. దిల్ రాజు తాము రేట్లు పెంచటం లేదని చెప్పినా హైదరాబాద్ ఐమ్యాక్స్ లో టిక్కెట్ ధర 295 రూపాయలు ఉంది. అంటే అదనంగా దరఖాస్తు చేసుకుంటే ఇచ్చే ధర తీసుకోలేదు తప్ప..పాత రేట్లను అలాగే కొనసాగించారు అన్న విషయం టిక్కెట్ కొన్న వాళ్లకు మాత్రమే తెలుస్తుంది.
కొద్ది రోజుల క్రితం ఐమ్యాక్స్ టిక్కెట్ ధర 150 రూపాయలు ఉండగా..అఖండ, పుష్ప2 సినిమాల సమయంలో దాన్ని 200 రూపాయలకు పెంచారు. అది చాలదన్నట్లు ఇప్పుడు ఏకంగా 295 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్, కెజీఎఫ్ 2 వంటి సినిమాలు అయితే ఇంకా అదనంగా వసూలు చేశాయి. ఇప్పుడు మేజర్ సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్ ధరలపై చివరకు ఇలా ప్రచారం చేసుకుంటోంది. కరోనా తర్వాత ఇంత తక్కువ ధర టిక్కెట్లతో ఏ సినిమా రాలేదని చెబుతోంది. తెలంగాణలో సింగిల్ స్క్రీన్స్ లో150 రూపాయలు, మల్టీప్లెక్స్ ల్లో అయితే 195 రూపాయలు, ఏపీలో సింగిల్ స్క్రీన్స్ లో 147 రూపాయలు, మల్టీప్లెక్స్ ల్లో 177 రూపాయలు అని తెలిపారు. ఈ సినిమా జూన్ 3న విడుదల అవుతుంది. అడవి శేష్ నటించిన ఈ సినిమాకు మహేష్ బాబు నిర్మాతగా వ్యవహరించారు.
కెసీఆర్ పెద్ద పరీక్షే పెట్టుకున్నారు..అందులో విజయం సాధ్యమా?!
2 July 2022 12:50 PM GMTస్పైస్ జెట్ విమానంలో పొగ..ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి
2 July 2022 5:36 AM GMTఆవో-దేఖో-సీకో
1 July 2022 3:17 PM GMTనుపుర్ శర్మపై సుప్రీం ఫైర్
1 July 2022 6:58 AM GMTఏపీలో సర్కారు వారి 'సినిమా ఆగింది'
1 July 2022 6:24 AM GMT
ప్రేమలేఖలు అందాయన్న శరద్ పవార్
1 July 2022 6:05 AM GMTఫడ్నవీస్ కు అధిష్టానం షాక్..డిప్యూటీ సీఎం పదవి
30 Jun 2022 2:04 PM GMTవ్యూహాం మార్చిన బిజెపి..శివసేనను పూర్తిగా ఖతం చేసేందుకేనా!
30 Jun 2022 12:27 PM GMTముంబయ్ చేరుకున్న ఏక్ నాథ్ షిండే
30 Jun 2022 9:42 AM GMTసంజయ్ రౌత్ కు ఈడీ నోటీసులు
27 Jun 2022 12:15 PM GMT