Telugu Gateway
Cinema

వినాయక చవితికి డీజెలు పెడతారంట

వినాయక చవితికి డీజెలు పెడతారంట
X

‘డీజే టిల్లు’ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద సంచలన విజయం నమోదు చేసుకుందో అందరికి తెలిసిందే. గత ఏడాది విడుదల అయిన ఈ మూవీతో ఒక్క సారిగా హీరో సిద్దు జొన్నలగడ్డ ఇమేజ్ ఒక రేంజ్ కు వెళ్ళింది. ఈ సినిమా లో హీరోయిన్ గా చేసిన నేహా శెట్టి పాత్ర రాధిక కు కూడా మంచి మార్కులు పడ్డాయి. ‘డీజే టిల్లు’ సూపర్ హిట్ కావటం తో కొద్ది రోజుల తర్వాత ఈ సినిమా కు కొనసాగింపు ఉంటుంది అని ప్రకటించారు. పేరు కూడా టిల్లు స్క్వేర్ గా ఫిక్స్ చేశారు. చిత్ర యూనిట్ సోమవారం నాడు ఈ సినిమా ను వినాయకచవితి సందర్భంగా సెప్టెంబర్ 15 న విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో టిల్లు ఫాన్స్ ఫుల్ ఖుషి.

ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ కలిసి నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. టిల్లు స్క్వేర్ సినిమాలో సిద్దు జొన్నలగడ్డకు జోడిగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. మరి ఆమె తొలి భాగంలో చేసిన నేహా శెట్టి రాధిక పాత్రను మరిపిస్తుందా లేదా అన్నదే ఇప్పుడు అందరిలో ఆసక్తి రేపుతున్న అంశం. ఒక్కమాటలో చెప్పాలంటే డీ జె టిల్లు సినిమాలో సిద్దు, నేహా శెట్టి పాత్రలు సూపర్ క్లిక్ అయ్యాయి. దీంతో రెండవ భాగంపై కూడా అదే రేంజ్ లో అంచనాలు ఉంటాయనే విషయం తెలిసిందే.

Next Story
Share it