'సర్కారువారిపాట' తొలి రోజు వసూళ్ళు 36.89 కోట్లు
మహేష్ బాబు, కీర్తిసురేష్ జంటగా నటించిన సినిమా సర్కారువారి పాట. గురువారం నాడు విడుదలైన ఈ సినిమా తొలి రోజు వసూళ్ళలో దుమ్మురేపింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకుని ఏకంగా 36.89 కోట్ల రూపాయల షేర్ సాధించినట్లు సమాచారం. ఓ ప్రాంతీయ సినిమా ఇంత భారీ మొత్తం వసూలు చేయటం రికార్డుగా చెబుతున్నారు. పరశ్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై మిక్స్ డ్ టాక్ వచ్చింది.
ఈ సినిమా ఫస్టాఫ్ సరదా సరదాగా సాగిపోగా..సెకండాఫ్ పై మాత్రం భిన్నాభిప్రాయాలువ్యక్తం అయ్యాయి. అయినా సరే తొలి రోజు ఓపెనింగ్స్ భారీగా ఉండటంతో చిత్ర యూనిట్ ఫుల్ కుషీగా ఉంది. రెండేళ్ల తర్వాత మహేష్ బాబు సినిమా విడుదల కావటంతో ఆయన ఫ్యాన్స్..అభిమానులు అందరూ కూడా థియేటర్లకు క్యూకట్టారు. ఎఫ్ 3 సినిమా విడుదల కానున్న మే 27 వరకూ భారీ సినిమాలు ఏమీ లేకపోవటం కూడా మహేష్ బాబు సినిమా సర్కారువారి పాటకు కలిసొచ్చే అంశంగా ఉంది.