Telugu Gateway
Cinema

స‌ర్కారువారి పాట స‌రికొత్త రికార్డు

స‌ర్కారువారి పాట స‌రికొత్త రికార్డు
X

మ‌హేష్ బాబు, కీర్తిసురేష్ లు జంట‌గా న‌టించిన స‌ర్కారువారి పాట సినిమా బాక్సాపీస్ వ‌ద్ద దుమ్మురేపుతోంది. ప్ర‌పంచ వ్యాప్తంగా అత్యంత వేగంగా 160 కోట్ల రూపాయ‌ల గ్రాస్, వంద కోట్ల రూపాయ‌లు షేర్ సాధించిన సినిమాగా ఇది నిలిచింద‌ని చిత్ర యూనిట్ వెల్ల‌డించింది. మే12న ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైన విష‌యం తెలిసిందే. ఈ సినిమా టాలీవుడ్ లో కొత్త రికార్డులు న‌మోదు చేస్తోంద‌ని మైత్రీ మూవీ మేక‌ర్స్ పేర్కొంది.

కొంత మంది స‌ర్కారువారి పాట సినిమాపై కావాల‌ని దుష్ప్ర‌చారం చేస్తుండ‌టంతో మ‌హేష్ బాబు ఫ్యాన్స్ వారిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఎవ‌రు ఎంత చేసినా త‌మ హీరో సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అంటూ సంతోషం వెలిబుచ్చుతున్నారు. ప‌ర‌శ్ రామ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా ఫ‌స్టాఫ్ స‌ర‌దా స‌ర‌దాగా సాగిపోగా..సెకండాఫ్ లో ఎక్కువ యాక్షన్ సీన్స్ తో ఫ‌స్టాఫ్ లో ఉన్నంత జోష్ త‌గ్గిన‌ట్లు అన్పిస్తుంది. ఓవ‌రాల్ గా చూస్తే సినిమా బాగానే న‌డుస్తోంది.

Next Story
Share it