Telugu Gateway
Cinema

రెడ్ కార్పెట్ పై నడవాల్సిన వాడివి..!

రెడ్ కార్పెట్ పై నడవాల్సిన వాడివి..!
X

ఐటి ఉద్యోగి..వ్యవసాయంలోకి దిగితే..అందులో ఎదురయ్యే కష్టాలు ఎలా ఉంటాయో చూపించబోతున్నారు 'శ్రీకారం' సినిమాలో. శుక్రవారం సాయంత్రం విడుదలైన సినిమా ట్రైలర్ చూస్తే ఇదే విషయం అర్ధం అవుతుంది. శర్వానంద్, ప్రియాంక అరుల్ మోహన్ జంటగా నటించిన ఈ సినిమా శివరాత్రి సంరద్భంగా మార్చి 11న విడుదల కానుంది.

'రెడ్ కార్పెట్ మీద నడవాల్సిన వాడివి. బురదలో దిగుతానంటావేంది?. కొన్ని చూసి తెలుసుకోవాలి..కొన్ని చేసి నేర్చుకోవాలి' వంటి పవర్ ఫుల్ డైలాగ్ లతో ట్రైలర్ ఆకట్టుకుంటోంది. శర్వానంద్ ఈ సినిమా ద్వారా మరోసారి విలక్షణ పాత్ర పోషించినట్లు స్పష్టం అవుతోంది.

Next Story
Share it