Telugu Gateway
Cinema

దుమ్మురేపుతున్న 'స‌ర్కారువారి పాట‌' ట్రైల‌ర్

దుమ్మురేపుతున్న స‌ర్కారువారి పాట‌ ట్రైల‌ర్
X

'నా ప్రేమ‌ను దొంగిలించ‌గ‌ల‌వు. నా స్నేహ‌న్నీ దొంగిలించ‌గ‌ల‌వు. నా డ‌బ్బును దొంగిలించ‌లేవు. అమ్మాయిలని..అప్పు ఇచ్చిన‌వాడిని పాంప‌ర్ చేయాలిరా' అంటూ సాగే మ‌హేష్ బాబు డైలాగు ల‌తో స‌ర్కారువారి పాట ట్రైల‌ర్ విడుద‌లైంది. ఈ ట్రైల‌ర్ చూస్తుంటే సినిమాలో యాక్షన్ కు యాక్షన్..అన్ని రకాల హంగామాలు ఉండేలా క‌న్పిస్తున్నాయి. ప‌ర‌శ్ రామ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ మూవీలో మ‌హేష్ బాబుకు జోడీగా కీర్తిసురేష్ న‌టించింది.

కీర్తిసురేష్ త‌న ఫీజుకు ప‌ది వేల డాల‌ర్లు కావాల‌ని కోరితే..మ‌హేష్ బాబు బాగా పాపుల‌ర్ అయిన వైఎస్ డైలాగ్ నేను విన్నాను..నేను ఉన్నాను అని చెబుతారు. ఆ వెంట‌నే వ‌చ్చే స‌న్నివేశంలో మ‌హేష్ హీరోయిన్ చీర‌ను కాస్త స‌ర్దటంతో ప‌క్క‌నే ఉన్న వెన్నెల కిషోర్ మీరేంటి సార్..ఈ అమ్మాయి విష‌యంలో ఇంత‌గా దిగ‌జారిపోయారు అన‌టం హైలెట్ గా నిలుస్తుంది. ఈ సినిమా మే 12న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌ల‌ను ఇప్ప‌టికే ఆక‌ట్టుకుంటున్నాయి.

Next Story
Share it