Telugu Gateway
Cinema

'స‌ర్కారు వారి పాట‌' అప్ డేట్

స‌ర్కారు వారి పాట‌ అప్ డేట్
X

మ‌హేష్ బాబు అభిమానుల‌కు గుడ్ న్యూస్. ఎప్ప‌టి నుంచో ఎదురుచూస్తున్న ఆయ‌న కొత్త సినిమా 'స‌ర్కారు వారి పాట‌' కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చింది చిత్ర యూనిట్. ఈ సినిమా నుంచి తొలి సింగిల్ ను ప్రేమికుల దినోత్స‌వం సంద‌ర్భంగా ఫిబ్ర‌వ‌రి 14న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలిపింది.

ప్రేమికుల దినోత్స‌వం రోజున అంద‌రం ఈ మెలోడీఆఫ్ ద ఇయ‌ర్ ప్రేమ‌లో ప‌డ‌దాం అంటూ పేర్కొంది. ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో మ‌హేష్ బాబుకు జోడీగా కీర్తి సురేష్ న‌టిస్తోంది. మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. త‌మ‌న్ ఫోటోతో ఈ పాట అప్ డేట్ విడుద‌ల చేశారు.

Next Story
Share it