Telugu Gateway
Cinema

'సర్కారువారి పాట' గోవా షెడ్యూల్ పూర్తి

సర్కారువారి పాట గోవా షెడ్యూల్ పూర్తి
X

మ‌హేష్ బాబు, కీర్తి సురేష్ జంట‌గా న‌టిస్తున్న సినిమా 'సర్కారువారి పాట'. ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమా తొలుత దుబాయ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. క‌రోనా రెండ‌వ ద‌శ కార‌ణంగా కొంత గ్యాప్ తీసుకుని తిరిగి షూటింగ్ ప్రారంభించారు. ఇప్ప‌టికే ఈ సినిమాను సంకాంత్రికి అంటే వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 13న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. దీంతో పెండింగ్ లో ఉన్న షూటింగ్ ప‌నులను శ‌ర‌వేగంగా పూర్తి చేస్తున్నారు.

తాజాగా ఈ సినిమా యూనిట్ గోవాలో షెడ్యూల్ ను కూడా పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్ బుధ‌వారంతో ముగియ‌టంతో మ‌హేష్ బాబు తిరిగి హైద‌రాబాద్ వ‌చ్చేశారు. గోవా షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు భారీ యాక్షన్ స‌న్నివేశాల‌ను షూట్ చేసిన‌ట్లు స‌మాచారం. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్‌ ప్లస్‌ పతాకాలపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ఎస్‌ఎస్‌ తమన్‌ మ్యూజిక్ అందిస్తున్నారు.

Next Story
Share it