Telugu Gateway
Cinema

పెళ్లిళ్లు ప్ర‌మాద‌క‌రం!

పెళ్లిళ్లు ప్ర‌మాద‌క‌రం!
X

విష‌యం ఏదైనా అక్క‌డ రామ్ గోపాల్ వ‌ర్మ ఉండాల్సిందే. అది సినిమా టిక్కెట్ల అంశం అయినా...సినిమా సెల‌బ్రిటీల విడాకుల అంశం అయినా. తాజాగా త‌మిళ హీరో ధ‌నుష్‌, ర‌జ‌నీకాంత్ కుమార్తె ఐశ్వర్య‌లు తాము విడాకులు తీసుకున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ప‌ద్దెనిమిది సంవ‌త్స‌రాల వివాహ బంధానికి ముగింపు ప‌లుకుతున్న‌ట్లు ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించారు. ఇది ఇప్పుడు త‌మిళనాడుతోపాటు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇదే అంశంపై వ‌ర్మ ట్వీట్ల మీద ట్వీట్లు చేశారు.

'పెళ్లిల్లు ఎంత ప్రమాదకరమో హెచ్చరించడానికి తారల విడాకులే మంచి ట్రెండ్‌ సెట్టర్స్‌' అని పేర్కొన్నారు. 'సంతోషంగా ఉండటానికి రహస్యం ఏమిటంటే.. పెళ్లి అనే జైలుకు వెళ్లడం కంటే వీలైనంతవరకూ ప్రేమించడం ఉత్తమం', 'స్మార్ట్‌ పీపుల్‌ లవ్‌ చేస్తారు. మూర్ఖులే పెళ్లి చేసుకుంటారు' అంటూ వరుస ట్వీట్లు చేశాడు రామ్‌ గోపాల్ వర్మ. విడాకులు మాత్ర‌మే సంగీత్ వంటి వేడుక‌ల‌తో సెల‌బ్రేట్ చేసుకోవాల‌న్నారు.

Next Story
Share it